ఏపీఎంఐడీసీ నియామకాల్లో మార్పులు
జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పేరేషన్ బోర్డు నియామకాల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ బోర్డు నియామకాల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమలు,పెట్టుబడుల శాఖ మినిస్టర్ గౌతమ్ రెడ్డిని ఛైర్మన్గా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఇక పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని బోర్డు ఉపాధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఆర్ధికశాఖ కార్యదర్శి సహా మత్స్యశాఖ, పర్యాటకశాఖ కమిషనర్లు, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓ, ఏపీఎంఐడీసీఎల్ ఎండీని ఏపీ మారిటైమ్ ఇన్ఫ్ర్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ బోర్డు డైరెక్టర్లుగా నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు వెలువరించింది.
Also Read :
చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కరోనా టెర్రర్..కేంద్రం కీలక ఆదేశాలు