Economic Survey 2024: మరికాసేపట్లో పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే.. రిలీజ్ చేసేది ఎవరంటే..?

|

Jul 22, 2024 | 6:30 AM

కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది. బీజేపీ దాని మిత్రపక్షాలన్నీ కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక్కరోజు ముందు అంటే సోమవారం (ఈరోజు) పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టునున్నారు.

Economic Survey 2024: మరికాసేపట్లో పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే.. రిలీజ్ చేసేది ఎవరంటే..?
Economic Survey 2024
Follow us on

కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది. బీజేపీ దాని మిత్రపక్షాలన్నీ కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక్కరోజు ముందు అంటే సోమవారం (ఈరోజు) పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టునున్నారు. ఆర్థిక సర్వే 2024 జూలై 22 మధ్యాహ్నం 1 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెడతారు. వార్షిక పత్రాన్ని మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో సమర్పించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సర్వే 2024 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేది స్వల్ప, మధ్యకాలిక అవకాశాల గురించి తెలుపుతూ గత సంవత్సరంలో ఆర్థిక స్థితిని సమీక్షించడానికి ప్రధానంగా ప్రభుత్వం సమర్పించే వార్షిక పత్రం. జాతీయ బడ్జెట్‌కు సంబంధించిన ప్రత్యేకతలను పరిశోధించే ముందు పార్లమెంటు పరిశీలన కోసం సమర్పించిన భారత ఆర్థిక వ్యవస్థపై ఒక వివరణాత్మక నివేదిక కార్డుగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సర్వేలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు వంటి వివిధ రంగాల విశ్లేషణతో సహా గత ఆర్థిక సంవత్సరంలో దేశానికి సంబంధించిన ఆర్థిక పనితీరు వివరాలను తెలుపుతుంది. అలాగే జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, ఉపాధి, ఆర్థిక లోటు వంటి ఆర్థిక పరిమితులకు సంబంధించిన గణాంక డేటాను అందిస్తారు. అలాగే ఆర్థిక సవాళ్లను పరిష్కరించడంతో పాటు వృద్ధిని ప్రోత్సహించడానికి విధాన చర్యలను సూచిస్తుంది. ఈ సిఫార్సులు తరచుగా కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో పరిగణిస్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాల సమీక్షకూడా ఉంటుంది. 

సీఈఏ మొత్తం మార్గదర్శకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ) ఆర్థిక విభాగం ద్వారా ఆర్థిక సర్వే రూపొందిస్తారు. ఈ రిపోర్ట్‌కు సంబంధించిన తుది సంస్కరణ ఆర్థిక కార్యదర్శి ద్వారా సమీక్ష చేసి ఆర్థిక మంత్రి ఆమోదిస్తారు. ఆర్థిక సర్వేను మూడు భాగాలుగా విభజిస్తారు. మొదటి భాగంలో దేశ ఆర్థిక స్థితిపై ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ కీలక ఆర్థిక సమస్యలపై సీఈఏ దృక్పథాన్ని అందిస్తుంది.రెండో భాగంలో ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు సంబంధించిన డేటా, గణాంకాలు, వాటి సంబంధిత విభాగాలు, మంత్రిత్వ శాఖల ద్వారా అందిసత్ారు. మూడో భాగం జాతీయ ఆదాయం, ఉత్పత్తి, ఉపాధి, ద్రవ్యోల్బణం, వాణిజ్యం, ఎగుమతి-దిగుమతి వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థకు అన్ని అంశాలను కవర్ చేసే ఇతర స్థూల ఆర్థిక గణాంకాలతో పాటు ఈ సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..