Stolen Luggage: రైలులో పదేళ్ల క్రితం లగేజీ దొంగతనం.. రూ.1.45 లక్షల జరిమానా కట్టమన్న వినియోగదారుల కమిషన్

|

Apr 27, 2024 | 4:40 PM

రైలు ప్రయాణంలో మన లగేజీ చోరీకి గురైతే మాత్రం ఏమి చేయలేమని అనుకంటూ ఉంటారు. అయితే ఓ వ్యక్తి 2014లో రైలులో తన లగేజీ చోరీకి గురైనా పట్టువదలని విక్రమార్కుడిలా వినియోగాదారుల కమిషన్ వద్ద పోరాడి రైల్వేతో రూ.1.45 లక్షల జరిమానా కట్టించడాడు. 2014లో ఢిల్లీ నుంచి పాట్నాకు రైలులో ప్రయాణిస్తుండగా చోరీకి గురైన రూ.1.2 లక్షల విలువైన వస్తువులను పోగొట్టుకున్న ప్రయాణికుడికి రూ.1.45 లక్షలు చెల్లించాలని ఢిల్లీలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ గత వారం ఉత్తర రైల్వేను ఆదేశించింది. 

Stolen Luggage: రైలులో పదేళ్ల క్రితం లగేజీ దొంగతనం.. రూ.1.45 లక్షల జరిమానా కట్టమన్న వినియోగదారుల కమిషన్
Railway Station
Follow us on

భారతదేశంలో రైలు ప్రయాణం అనేది అతి చవకైన ప్రయాణ సాధనంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబం మొత్తం దూరప్రాంతాలకు వెళ్లాలనుకుంటే కచ్చితంగా రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. అయితే రైలు ప్రయాణంలో మన లగేజీ చోరీకి గురైతే మాత్రం ఏమి చేయలేమని అనుకంటూ ఉంటారు. అయితే ఓ వ్యక్తి 2014లో రైలులో తన లగేజీ చోరీకి గురైనా పట్టువదలని విక్రమార్కుడిలా వినియోగాదారుల కమిషన్ వద్ద పోరాడి రైల్వేతో రూ.1.45 లక్షల జరిమానా కట్టించడాడు. 2014లో ఢిల్లీ నుంచి పాట్నాకు రైలులో ప్రయాణిస్తుండగా చోరీకి గురైన రూ.1.2 లక్షల విలువైన వస్తువులను పోగొట్టుకున్న ప్రయాణికుడికి రూ.1.45 లక్షలు చెల్లించాలని ఢిల్లీలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ గత వారం ఉత్తర రైల్వేను ఆదేశించింది. 

ప్రయాణికుడు అజోయ్ కుమార్ నుంచి చోరీకి గురైన వాటిలో బంగారు గొలుసు, బంగారు ఉంగరం, నాలుగు చీరలు, రెండు సూట్లు ఉన్నాయి. అధికారుల అజాగ్రత్త కారణంగా తన సామాను దొంగిలించారని కుమార్ వాదించగా వ్యక్తిగత కస్టడీలో తీసుకెళ్లిన సామగ్రి లేదా బుక్ చేయని వస్తువులకు వారు బాధ్యత వహించరని రైల్వే వాదించింది. భారతీయ రైల్వే చట్టంలోని సెక్షన్ 100ని ఉటంకిస్తూ బుక్ చేయని లగేజీకి రైల్వే బాధ్యత వహించదు కాబట్టి ఫిర్యాదును కొట్టివేయాలని వారు వాదించారు. అయితే, వినియోగదారుల పక్షాన, జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ) ఏప్రిల్ 16న విచారణ నిర్వహఇంచిన 

ప్రయాణికుల భద్రత మరియు వారి లగేజీల భద్రతను నిర్ధారించడంలో నిర్లక్ష్యానికి రైల్వేలు బాధ్యులుగా ఉండవచ్చని పేర్కొంది. చోరీ జరిగిన పది నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత వినియోగదారుల ఫిర్యాదు నమోదైందని రైల్వే కూడా వాదించింది. ఎఫ్‌ఐఆర్ నమోదు కోసం ప్రయాణికుడు తొలుత ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)ని సంప్రదించినా ఫలితం లేకుండా పోయిందని కమిషన్ వాదనలను తోసిపుచ్చింది. ఫిర్యాదుదారుడు న్యూఢిల్లీలోని బరోడా హౌస్‌లో రైల్వే పోలీస్ ఫోర్స్ సంప్రదించినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఎన్‌సీడీఆర్‌సీ ఆక్షేపించింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి