SBI Utility Bill Payments: ఖాతాదారులకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన ఎస్‌బీఐ.. ఆ చెల్లింపులపై అదనపు చార్జీల వసూలు

|

Oct 10, 2024 | 8:14 PM

భారతదేశంలో స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఖాతాదారులు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఇటీవల పెరిగిన ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో పలు బిల్లులను చెల్లించడానికి క్రెడిట్‌ కార్డులను వినియోగిస్తున్నారు. ఇలాంటి వారికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షాక్‌ ఇచ్చింది. విద్యుత్, గ్యాస్ లేదా నీరు వంటి యుటిలిటీ బిల్లులను చెల్లించడానికి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తుంటే  నవంబర్ 1, 2024 నుంచి అలాంటి చెల్లింపులపై ఎస్‌బీఐ అదనంగా 1% ఛార్జీని విధిస్తుంది.

SBI Utility Bill Payments: ఖాతాదారులకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన ఎస్‌బీఐ.. ఆ చెల్లింపులపై అదనపు చార్జీల వసూలు
SBI
Follow us on

భారతదేశంలో స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఖాతాదారులు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఇటీవల పెరిగిన ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో పలు బిల్లులను చెల్లించడానికి క్రెడిట్‌ కార్డులను వినియోగిస్తున్నారు. ఇలాంటి వారికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షాక్‌ ఇచ్చింది. విద్యుత్, గ్యాస్ లేదా నీరు వంటి యుటిలిటీ బిల్లులను చెల్లించడానికి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తుంటే  నవంబర్ 1, 2024 నుంచి అలాంటి చెల్లింపులపై ఎస్‌బీఐ అదనంగా 1% ఛార్జీని విధిస్తుంది. ముఖ్యంగా ఎస్‌బీఐ తన క్రెడిట్ కార్డ్ ఛార్జ్ లెక్కింపు యంత్రాంగానికి ప్రధానంగా రెండు ప్రధాన మార్పులను ప్రకటించింది. ఎస్‌బీఐ నిర్ణయం నేపథ్యంలో యుటిలిటీ బిల్లుల చెల్లింపుతో పాటు ఇతర నిర్ణయాల గురించి ఓ సారి తెలుసుకుందాం.

ఎస్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయం నవంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది క్రెడిట్ కార్డ్ లావాదేవీలకు రుసుము వర్తించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. మొదటి మార్పు క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే యుటిలిటీ బిల్లు చెల్లింపులపై 1 శాతం సర్‌ఛార్జ్‌ని విధిస్తారు. అలాగే రుసుము సర్దుబాట్లు లేదా అదనపు సర్‌ఛార్జ్‌లకు సంబంధించినది. అయితే క్రెడిట్‌ కార్డుల వినియోగదారులకు ఎస్‌బీఐ భవిష్యత్‌లో మరిన్ని షాక్‌ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల వినియోగదారులకు ఫీజు రేట్లలో మార్పుల గురించి తెలియజేస్తూ ఈ-మెయిల్‌లు పంపింది. ముఖ్యంగా ఎస్‌బీఐ రూ. 50,000 కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లుల చెల్లింపుపై బ్యాంక్ సర్‌చార్జి వసూలు చేస్తుంది.

నవంబర్ 1, 2024 నుంచి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి చెల్లించినప్పుడు ఒకే స్టేట్‌మెంట్ సైకిల్‌లో రూ. 50,000 కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లు చెల్లింపులపై ఎస్‌బీఐ 1 శాతం అదనపు ఛార్జీని విధిస్తుంది. అయితే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా మీ యుటిలిటీ బిల్లు చెల్లింపులు అదే సైకిల్‌లో రూ. 50,000లోపు ఉంటే, అదనపు ఛార్జీలు వర్తించవు. అయితే 1 డిసెంబర్ 2024 నుంచి బిల్లింగ్ సైకిల్‌లో చేసిన అన్ని యుటిలిటీ చెల్లింపుల మొత్తం రూ. 50,000 దాటితే యుటిలిటీ చెల్లింపుల మొత్తంపై ఒక శాతం రుసుము వర్తిస్తుందని ఎస్‌బీఐ అధికారులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

నవంబర్ 1, 2024 నుంచి అమలులోకి వచ్చే అన్‌సెక్యూర్డ్‌క్రెడిట్ కార్డ్‌లపై ఫైనాన్స్ ఛార్జీలలో మార్పులను కూడా బ్యాంక్ ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం, శౌర్య/డిఫెన్స్ క్రెడిట్ మినహా అన్ని అన్‌సెక్యూర్డ్‌ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లపై 3.75 శాతం ఫైనాన్స్ ఛార్జీ విధించబడుతుంది. కార్డు. అన్‌సెక్యూర్డ్‌ క్రెడిట్ కార్డ్‌లు అంటే సెక్యూరిటీ డిపాజిట్ లేదా కొలేటరల్ అవసరం లేనివి, సెక్యూర్డ్‌ క్రెడిట్ కార్డుల్లా కాకుండా ఇవి సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లకు వ్యతిరేకంగా జారీ చేస్తారు. ఎస్‌బీఐ కార్డులకు సంబంధించిన వెబ్‌సైట్‌లోని ఫైనాన్స్ ఛార్జీల పెంపు గురించిన అప్‌డేట్‌ను పంచుకున్నాయి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి