RBI: ఆర్బీఐ కొరడా..ఈ నాలుగు బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ భారీ జరిమానా!

|

Feb 10, 2024 | 9:11 AM

నిబంధనలు ఉల్లంఘించిన 4 సహకార బ్యాంకులపై చర్యలు తీసుకుంది ఆర్బీఐ. ఈ నాలుగు సహకార బ్యాంకులకు భారీ జరిమానా విధించింది ఆర్బీఐ. ఇందులో మహారాష్ట్రలోని ఈ పాత సహకార బ్యాంకు కూడా ఉంది. వాస్తవానికి ఇది శిక్షార్హమైన చర్య మాత్రమే. ఈ బ్యాంకులు నిబంధనలను పాటించకుంటే మరింత కఠిన చర్యలు తీసుకోవలసి ఉంటుందని ఆర్బీఐ హెచ్చరించింది. నిబంధనలను ఉల్లంఘించిన..

RBI: ఆర్బీఐ కొరడా..ఈ నాలుగు బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ భారీ జరిమానా!
RBI
Follow us on

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎంపై ఆంక్షలు విధించిన విష‌యం తెలిసిందే. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీసుకున్న చర్యల కారణంగా బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలను దిగ్భ్రాంతికి గురి చేసింది. పలుమార్లు ఆదేశాలు జారీ చేసినా నిబంధనలు ఉల్లంఘించిన 4 సహకార బ్యాంకులపై చర్యలు తీసుకుంది ఆర్బీఐ. ఈ నాలుగు సహకార బ్యాంకులకు భారీ జరిమానా విధించింది ఆర్బీఐ. ఇందులో మహారాష్ట్రలోని ఈ పాత సహకార బ్యాంకు కూడా ఉంది. వాస్తవానికి ఇది శిక్షార్హమైన చర్య మాత్రమే. ఈ బ్యాంకులు నిబంధనలను పాటించకుంటే మరింత కఠిన చర్యలు తీసుకోవలసి ఉంటుందని ఆర్బీఐ హెచ్చరించింది.

నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 8న ఈ చర్య తీసుకుంది. నాలుగు సహకార బ్యాంకులపై చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన చర్యల గురించి ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం, నకోదర్ హిందూ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, పార్సీ కో-ఆపరేటివ్ బ్యాంక్, బాంబే మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ది నవనిర్మాణ్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లకు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏ బ్యాంకులో ఎంత జరిమానా

ఇవి కూడా చదవండి

ఆర్‌బీఐ నిబంధనలకు లోబడి ఈ చర్య తీసుకున్నామ‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ బ్యాంకులకు నోటీసులు కూడా జారీ చేశారు. సూచనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని ఆర్బీఐ హెచ్చరించింది. బాంబే మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంకుపై రూ.63.30 లక్షల జరిమానా విధించ‌గా, జొరాస్ట్రియన్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై రూ.43.40 లక్షల జరిమానా విధించింది. నాకోదర్ హిందూ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుకు 6 లక్షలు, నవనిర్మాణ్ సహకారి బ్యాంక్‌పై 1 లక్ష జరిమానా విధించింది. అలాగే బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన‌ట్లు ఆర్బీఐ పేర్కొంది. కస్టమర్ల ప్రయోజనాల కోసం దేశంలోని అన్ని బ్యాంకులను ఆర్‌బీఐ పర్యవేక్షిస్తుంది. అలాగే బ్యాంకు ఇబ్బందుల్లోకి వెళితే, రిసీవర్‌ను నియమిస్తారు. లిక్విడేషన్ ప్రక్రియలో వినియోగదారుల ప్రయోజనాల కోసం చర్యలు తీసుకుంటారు. బ్యాంకు వద్ద తగినంత మూలధనం లేకపోతే, ఖాతాదారుల ప్రయోజనాల దృష్ట్యా బ్యాంకును మూసివేయాలని నిర్ణయిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులను ఆర్బీఐ మూసివేస్తే కస్టమర్లు నష్టపోకుండా రూ. 5 లక్షల వరకు హామీ ఇస్తారు.

బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన తర్వాత, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) డిపాజిటర్‌కు పరిహారంగా నిర్ణీత మొత్తాన్ని ఇస్తుంది. వినియోగదారులు నిర్ణీత మొత్తాన్ని పొందుతారు. ప్రస్తుతం ఐదు లక్షల రూపాయల వరకు డిపాజిట్ రక్షణ కల్పిస్తుంది ఆర్బీఐ.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి