2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి గడవు జూలై 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో నిర్ణీత ఆదాయం దాటిన చాలా మంది ఉద్యోగులు, వ్యాపారులు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేశారు. ముఖ్యంగా లాస్ట్ డేట్ సమయంలో రద్దీ ఉంటుందనే ఉద్దేశంలో ఇప్పటికే చాలా మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే చాలా మంది రీఫండ్ బ్యాంకు ఖాతాలో జమైన కొంత మందికి మాత్రం జమ కాలేదు. అయితే ఐటీ రీఫండ్ పొందాలంటే మీ ఐటీఆర్ తప్పనిసరిగా ఈ-వెరిఫై చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా పన్ను చెల్లింపుదారుల ఖాతాలో రీఫండ్ జమ కావడానికి నాలుగు నుంచి ఐదు వారాల సమయం పడుతుంది. అయితే, ఈ వ్యవధిలో రీఫండ్ అందకపోతే పన్ను చెల్లింపుదారు ఐటీఆర్లో వ్యత్యాసాలకు సంబంధించిన సమాచారం కోసం తనిఖీ చేయాలి. ఈ నేపథ్యంలో ఐటీఆర్ రీఫండ్ స్టేటస్ తనిఖీ ఎలా చేయాలో? ఓసారి తెలుసుకుందాం.
మీరు ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్లో మీ ఐటీఆర్ రీఫండ్ స్థితిని కూడా తనిఖీ చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా మీ పాన్ను నమోదు చేసి, అసెస్మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోవాలి. అనంతరం ‘క్యాప్చా కోడ్’ని నమోదు చేసి ‘ప్రొసీడ్’ బటన్పై క్లిక్ చేస్తే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ స్టేటస్ డిస్ప్లే అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి