దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. కోవిడ్ దెబ్బతో అన్నివర్గాలు, రంగాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో పలు ఆటోమొబైల్ సంస్థలు తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. వ్యారంటీ, సర్వీసింగ్ పీరియడ్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో ముఖ్యంగా… మహీంద్రా అండ్ మహీంద్రా, ఆడి, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, హోండా మోటార్స్ సైకిల్స్ గడువును పెంచాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా, దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వ్యారంటీ, సర్వీసింగ్ పీరియడ్ను జూలై 31వ తేదీ వరకు పొడిగిస్తూ తన కస్టమర్లకు ఊరట కలిగించాయి. ఏప్రిల్ 1 తేదీ నుంచి ఈ నెలాఖరు వరకు వారంటీ గడువు ముగిసే వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది.
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ జర్మన్కు చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడీ భారత్లోని తమ కస్టమర్ల వారంటీ, సర్వీస్ ప్లాన్స్ను జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్, మే నెలల్లో వారంటీ లేదా సర్వీసింగ్ ప్లాన్స్ ముగిసే కార్లకు ఈ పొడిగింపు అందుబాటులో ఉంటుంది. టాటా మోటార్స్ తమ కమర్షియల్ వెహికిల్స్ కస్టమర్ల వారంటీ, ఫ్రీ సర్వీసింగ్ పీరియడ్ను జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. కరోనాను నియంత్రించేందుకు పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.
బజాజ్ ఆటో మొబైల్స్ బజాజ్ ఆటో మొబైల్స్ తమ అన్ని బ్రాండ్స్ వాహనాలకు జూలై చివరి వరకు ఫ్రీ సర్వీసింగ్ పీరియడ్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు ఫ్రీ సర్వీసింగ్ పీరియడ్ ముగిసే వాహనాలకు వర్తిస్తుంది. హోండా మోటార్స్ తన అన్ని మోడల్ బైక్స్, స్కూటర్ల వారంటీ, ఫ్రీ సర్వీసింగ్ పీరియడ్ను జూలై నెలాఖరు వరకు పొడిగించింది. ఏప్రిల్ 1 నుండి మే 31 మధ్య వారంటీ గడువు ఉన్న వారికి ఇది వర్తిస్తుంది.