Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

|

Jun 10, 2024 | 4:50 PM

దేశంలో శాటిలైట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ సేకరణను ప్రారంభించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. ముందుగా వాణిజ్య వాహనాలకు దీన్ని అమలు చేయనున్నారు. దీని తరువాత, ఈ సాంకేతికత ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్‌లకు కూడా దశలవారీగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది కేంద్రం. రాబోయే రెండేళ్లలో అన్ని టోల్ కలెక్షన్ పాయింట్ల వద్ద ఈ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS)ని ఇన్‌స్టాల్ చేయడానికి..

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
Toll Plaza
Follow us on

దేశంలో శాటిలైట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ సేకరణను ప్రారంభించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. ముందుగా వాణిజ్య వాహనాలకు దీన్ని అమలు చేయనున్నారు. దీని తరువాత, ఈ సాంకేతికత ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్‌లకు కూడా దశలవారీగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది కేంద్రం. రాబోయే రెండేళ్లలో అన్ని టోల్ కలెక్షన్ పాయింట్ల వద్ద ఈ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS)ని ఇన్‌స్టాల్ చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. దీంతో ఫాస్టాగ్ సేవలు ముగియనున్నాయి.

కొత్త టెక్నాలజీ కారణంగా టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నుండి ఉపశమనం ఉంటుంది. ఈ టెక్నాలజీ కింద వినియోగదారుడు తాను ప్రయాణించాల్సిన దూరాన్ని బట్టి టోల్ చెల్లించాల్సి ఉంటుంది. జీఎన్‌ఎస్‌ఎస్‌ ఆధారిత టోల్ వ్యవస్థ అవరోధ రహిత ఎలక్ట్రానిక్ టోల్ సేకరణగా ఉంటుంది. దీనిలో వాహనం ప్రయాణించిన కిలోమీటర్ల సంఖ్యను గుర్తించడానికి వాహనం కదలికను ట్రాక్ చేయబడుతుంది.

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో GNSS ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ విధానాన్ని అమలు చేయడానికి ప్రపంచ కంపెనీలను ఆహ్వానించింది. ప్రతి టోల్ ప్లాజాలో GNSS వాహనాలను గుర్తించడానికి ముందస్తు రీడర్‌లతో రెండు లేదా అంతకంటే ఎక్కువ GNSS లేన్‌లు ఉంటాయి. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్‌ఎస్‌ఎస్‌) లేన్‌లోకి ప్రవేశించే జీఎన్‌ఎస్‌ఎస్‌ కాని వాహనాలకు అదనపు ఛార్జీ విధిస్తారు. మొదటి మూడు నెలల్లో 2,000 కి.మీ జాతీయ రహదారులపై జిఎన్‌ఎస్‌ఎస్ ఆధారిత టోలింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. దీని తర్వాత, వచ్చే తొమ్మిది నెలల్లో 10,000 కి.మీలకు, 25,000 కి.మీ టోల్ హైవేలకు, 15 నెలల్లో 50,000 కి.మీలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఫాస్టాగ్ వ్యవస్థ ఉంది. ఇందులో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీని ఉపయోగించారు. ఇది 2015లో ఫాస్టాగ్ రూపంలో ప్రవేశపెట్టారు.

నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్:

కొన్ని రోజుల క్రితం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. కొన్నిసార్లు ప్రజలు టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలలో ఇరుక్కుపోతారని, చాలాసేపు వేచి ఉండవలసి ఉంటుందని చెప్పారు. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కొత్త మార్గాన్ని కనిపెట్టింది. శాటిలైట్ టోల్ సిస్టమ్ త్వరలో ప్రారంభం కానుంది. బెంగుళూరు, మైసూర్, పానిపట్‌లలో దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా ఉపయోగిస్తున్నారు. దేశంలో ఈ ఏడాదిలోనే ఈ టోల్‌ విధానం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి