Gold and Silver Cost: మహిళలకు గుడ్ న్యూస్.. దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు

|

Feb 01, 2023 | 6:58 AM

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. గత కొన్ని రోజులుగా రెక్కలు వచ్చినట్లు దూసుకెళ్లిన పసిడి ధరలు.. నేడు కొంతమేర దిగివచ్చాయి.  ఈ నేపథ్యంలో నేడు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో సహా దేశంలో పసిడి వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Gold and Silver Cost: మహిళలకు గుడ్ న్యూస్.. దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు
Astro Tips For Gold
Follow us on

బంగారం, వెండి లోహాల కొనుగోలుకు భారతీయులు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ప్రస్తుతం బంగారాన్ని ఓ పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పు, నగల మార్కెట్‌లతో సహా అనేక పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి. దీంతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. గత కొన్ని రోజులుగా రెక్కలు వచ్చినట్లు దూసుకెళ్లిన పసిడి ధరలు.. నేడు కొంతమేర దిగివచ్చాయి.  ఈ నేపథ్యంలో నేడు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో సహా దేశంలో పసిడి వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

అంతర్జాతీయంగా బంగారం.. వెండి ధరలు పెరిగినప్పటికీ.. దేశీయంగా కొంతమేర తగ్గుముఖం పట్టాయి.

ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 మేర తగ్గి.. రూ.52,500కు చేరుకుంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్  ధర రూ.170 మేర తగ్గి..  రూ.57,270 వద్ద కొనసాగుతోంది. ఇదే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్ లో కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 మేర తగ్గి.. రూ.52,650కు చేరుకుంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్  ధర రూ.160 మేర తగ్గి.. రూ.57,430 వద్ద కొనసాగుతోంది.

దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,500 ఉండగా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ. 57,270లు ఉంది.

చెన్నై లో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,380 ఉండగా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ. 58,230లు ఉంది.

వెండి ధరలు: 
బంగారం బాటలో వెండి కూడా నడుస్తూ.. కొంతమేర సిల్వర్ ధర దిగి వచ్చింది. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.200 మేర దిగి వచ్చిండిల్. దీంతో  ప్రస్తుతం వెండి ధర రూ.74,500 వద్ద కొనసాగుతుంది. ఇదే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్ లో కొనసాగుతున్నాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర వంద రూపాయలు తగ్గి.. రూ.72,300కు చేరింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..