వ్యయ భారం తగ్గించుకునే దిశగా బీఎస్ఎన్ఎల్.. ఏం చేస్తుందంటే..?

| Edited By:

Nov 07, 2019 | 5:01 AM

బీఎస్ఎన్ఎల్ తన వ్యయ భారాన్నీ తగ్గించుకునేందుకు ఉద్దీపన చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టింది. దీంతో సంస్థలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పదవీ విరమణ చేసే అవకాశం ఉంది. ఈ పథకం ప్రవేశపెట్టడంతో.. ఉన్న ఉద్యోగుల్లో దాదాపు సగంమంది స్వచ్ఛంద పదవీ విరమణ చేసే అవకాశం ఉంది. దీంతో సంస్థకు వేల కోట్ల జీతభత్యాల ఖర్చు తగ్గనుంది. 70 నుంచి 80 వేలమంది ఈ పథకాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీంతో […]

వ్యయ భారం తగ్గించుకునే దిశగా బీఎస్ఎన్ఎల్.. ఏం చేస్తుందంటే..?
Follow us on

బీఎస్ఎన్ఎల్ తన వ్యయ భారాన్నీ తగ్గించుకునేందుకు ఉద్దీపన చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టింది. దీంతో సంస్థలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పదవీ విరమణ చేసే అవకాశం ఉంది. ఈ పథకం ప్రవేశపెట్టడంతో.. ఉన్న ఉద్యోగుల్లో దాదాపు సగంమంది స్వచ్ఛంద పదవీ విరమణ చేసే అవకాశం ఉంది. దీంతో సంస్థకు వేల కోట్ల జీతభత్యాల ఖర్చు తగ్గనుంది. 70 నుంచి 80 వేలమంది ఈ పథకాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీంతో దాదాపు రూ.7వేల కోట్ల మేర జీతభత్యాల చెల్లింపుల ఖర్చు తగ్గే అవకాశం ఉందని బీఎస్‌ఎన్‌ఎల్‌ భావిస్తోంది. ఈ వీఆర్ఎస్ స్కీమ్ నవంబర్‌ 4 నుంచే ప్రారంభమైంది. డిసెంబర్‌ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీకే పుర్వార్‌ తెలిపారు. ఇప్పటికే ఈ వీఆర్‌ఎస్‌కు సంబంధించిన సమాచారాన్ని ఉద్యోగులందరికీ తెలిపామన్నారు. మొత్తం 1.50 లక్షల మంది ఉద్యోగుల్లో దాదాపుగా లక్ష మంది ఉద్యోగులు.. ఈ వీఆర్‌ఎస్‌ స్కీంకు అర్హులన్నారు. వీరిలో 70 నుంచి 80 వేల మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ చేసే అవకాశం ఉందని పుర్వార్‌ తెలిపారు. వీరి వీఆర్‌ఎస్‌ వల్ల కార్పొరేషన్‌కు రూ.7వేల కోట్ల మేర జీతభత్యాల భారం తగ్గనుందని తెలిపారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేస్తున్న 50 ఏళ్లు పైబడిన పర్మినెంట్ ఉద్యోగులు.. ఈ వీఆర్ఎస్ స్కీంకి అర్హులు. ఇప్పటి వరకు పూర్తి చేసుకున్న సర్వీసుకు గానూ.. ఏడాదికి 35 రోజుల లెక్క వేతనాన్ని, రిటైర్మెంట్‌ వయసుకు మిగిలి ఉన్న ఏళ్లకు గానూ 25 రోజుల వేతనాన్ని వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా కింద ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు ఎంటీఎన్‌ఎల్‌ సంస్థ కూడా ఉద్యోగులకు ఇదే వీఆర్ఎస్ స్కీం ప్రవేశపెట్టింది. దీనికి కూడా అందులో పనిచేసే ఉద్యోగులు.. డిసెంబర్‌ 3 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కాగా, ఇటీవలే బీఎస్‌ఎన్‌ఎల్‌-ఎంటీఎన్‌ఎల్‌ను విలీనం చేస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.