‘నో ఎంట్రీ జోన్’ నిబంధనలను సడలించిన హైకోర్టు

|

Oct 21, 2020 | 6:51 PM

దుర్గాదేవి భక్తుల్లో దుమారం రేపిన ‘నో ఎంట్రీ జోన్’ ఆదేశాలపై కోల్‌కతా హైకోర్టు వెనక్కి తగ్గింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను కొంచెం సడలించింది. ఈ మేరకు బుధవారం కోల్‌కతా హైకోర్టు రివైజ్డ్ ఆర్డర్స్....

‘నో ఎంట్రీ జోన్’ నిబంధనలను సడలించిన హైకోర్టు
Follow us on

High Court eased No Entry Zone orders: దుర్గాదేవి భక్తుల్లో దుమారం రేపిన ‘నో ఎంట్రీ జోన్’ ఆదేశాలపై కోల్‌కతా హైకోర్టు వెనక్కి తగ్గింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను కొంచెం సడలించింది. ఈ మేరకు బుధవారం కోల్‌కతా హైకోర్టు రివైజ్డ్ ఆర్డర్స్ జారీ చేసింది. దుర్గామాత మండపాలను ఏర్పాటు చేసే వారు భక్తుల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని హైకోర్టు ఆదేశించింది.

కోవిడ్-19 పాండమిక్ పరిస్థితుల్లో వచ్చిన దసరా ఉత్సవాలలో కనీస దూరం నిబంధనను విస్మరిస్తారన్న ముందు జాగ్రత్తతో దుర్గామాత మండపాలను నో ఎంట్రీ జోన్లుగా కోల్‌కతా హైకోర్టు ప్రకటించిన సంగతి తెలసిందే. అయితే దుర్గా మాత మండపాలను నెలకొల్పే వారు తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడంతో గతంలో ఇచ్చిన ఆదేశాలను కాస్త సవరించింది హైకోర్టు.

చిన్న మండపాల దగ్గర 15 మందిని, పెద్ద మండపాల దగ్గర 60 మంది భక్తులను అనుమతించవచ్చని తాజా ఆదేశాలల పేర్కొన్నారు. అదే సమయంలో మండపాల అవతల అమ్మవారికి ఢాకీస్ సమర్పించవచ్చని తెలిపారు. అయితే, పూజ మండపాల నిర్వాహకులు.. మండపాల వద్ద భక్తుల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఓ బ్లూ ప్రింట్ ద్వారా కోర్టుకు నివేదించాలని ఆదేశాలిచ్చారు.

అక్టోబర్ 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బెంగాల్ వ్యాప్తంగా దుర్గాదేవి ఉత్సవాలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఈ దసరా ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ బెంగాల్‌లో జరిగే ఉత్సవాలను ప్రత్యేకత వుంది. గర్భా న‌ృత్యాలతో దుర్గా మాత మండపాలు వేలాది భక్తుల సందోహం మధ్య జరుగుతాయి. ఈసారి కరోనా ప్రభావంతో నియమిత సంఖ్యలో భక్తుల హాజరుతో పండుగ ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Also read: స్వప్నా సురేశ్ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్

Also read: అభిమానులకు శుభవార్త చెప్పిన సంజయ్‌దత్ 

Also read: తొక్కిసలాటలో 12 మంది మహిళలు దుర్మరణం

Also read: పెళ్ళి పేరుతో యువతి మోసం..మైండ్ బ్లాక్ అయిన అబ్బాయి