ఏపీ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. జులై 22 అంటే రేపు(బుధవారం) మధ్యాహ్నం 1.29 నిమిషాలకు ఇద్దరు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకే సీఎం జగన్ రాజ్ భవన్కు చేరుకోనున్నారు. కాగా రాజ్యసభకు ఎన్నికైనందున సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ తమ మంత్రి పదవులకు చేసిన రాజీనామాలను నిన్న గవర్నర్ బిశ్వ భూషణ్ ఆమోదించిన సంగతి తెలిసిందే. కాగా తూర్పు గోదావరి జిల్లాకు శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకార కుంటుంబానికి చెందిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం. కాసేపట్లో మంత్రి వర్గ సభ్యుల పేర్లను అధికారికంగా వెల్లడించనుంది ఏపీ ప్రభుత్వం.
Read More:
ర్యాపిడ్ టెస్టుల కోసం క్యూ కడుతున్న జనం..
కరోనా ట్రీట్మెంట్ విషయంపై ఏపీ ప్రభుత్వ కీలక మార్గదర్శకాలు..