Bomb attack in Kabool University kills many: వరుస బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిపోతున్న అఫ్గానిస్తాన్లో మరో భీకర తీవ్రవాద దాడి జరిగింది. ఈసారి ఏకంగా రాజధాని కాబూల్ యూనివర్సిటీలో జరిగిన తీవ్రవాద దాడిలో 25 మంది దుర్మరణం పాలైనట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. పదుల సంఖ్యలో విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఎఫ్పీ వార్తా సంస్థ బ్రేకింగ్ న్యూస్ ప్రచురించింది.
సోమవారం మధ్యాహ్నం కాబూల్ యూనివర్సిటీలో దూరిన ముగ్గురు తీవ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. ఆయుధాలు ధరించిన ఓ తీవ్రవాది యూనివర్సిటీలో కాల్పులకు తెగబడగా.. కొన్ని గంటల ఎదురు కాల్పుల తర్వాత భద్రతా దళాలు తీవ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. ‘‘ ముగ్గురు తీవ్రవాదులు ఆయుధాలు ధరించి యూనివర్సిటీలో దాడికి పాల్పడ్డారు… విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. వారి దగ్గర తుపాకులతోపాటు పేలుడు పదార్థాలు కూడా వున్నాయి.. ముగ్గురిలో ఇద్దరు తీవ్రవాదులను సెక్యూరిటీ దళాలు మట్టుబెట్టాయి.. ’’ అని అఫ్ఘనిస్తాన్ హోం శాఖ మంత్రి తారీఖ్ ఆరియన్ చెప్పినట్లు ఏఎఫ్పీ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ తీవ్రవాద దాడిలో 25 మంది వరకు మరణించి వుండవచ్చని ప్రాథమిక సమాచారం.
ALSO READ: సరిహద్దులో చైనా మరో కుట్ర
ALSO READ: ఐపీఎల్ చివరి దశలో కీలకంగా సన్రైజర్స్
ALSO READ: ఏపీ హైకోర్టు రోస్టర్లో కీలక మార్పులు