బైక్‌ల చోరీలు : వీళ్ల రూటే సెపరేట్ !

ఈ దొంగలది సినిమా స్టైల్. హైదరాబాద్ లో కొట్టేసిన బైక్‌లను బీదర్‌లో, బీదర్‌లో దొంగిలించిన వాటిని హైదరాబాద్‌లో అమ్ముతూ ఉంటారు.

బైక్‌ల చోరీలు : వీళ్ల రూటే సెపరేట్ !
Follow us

|

Updated on: Sep 13, 2020 | 3:53 PM

ఈ దొంగలది సినిమా స్టైల్. హైదరాబాద్ లో కొట్టేసిన బైక్‌లను బీదర్‌లో, బీదర్‌లో దొంగిలించిన వాటిని హైదరాబాద్‌లో అమ్ముతూ ఉంటారు. అయితే ఎప్పుడూ కేటుగాళ్ల ఆటే సాగుతుందా, కట్ చేస్తే ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్న కాప్స్ అందర్నీ సెల్ లో పడేశారు. వారి వద్ద నుంచి రూ.25లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే..  కర్ణాటకలోని బీదర్‌కు చెందిన అమీర్‌(21), ఫహాద్‌ఖాన్‌(20), మహ్మద్‌ అజామ్‌(19), షేక్‌ మొయినుద్దీన్‌(19),షేక్‌ మహ్మద్‌ అజామ్‌(19), మహ్మద్‌ షకీబ్‌ అహ్మద్‌(20) డైలీ లేబర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే జల్సాలకు అలవాటుపడిన వీరు, డబ్బు చాలక ఒక గ్యాంగ్ గా మారి ఖరీదైన బైక్‌ల దొంగతనం చేయడం ప్రారంభించారు. వాటిని ఎలా కొట్టేయాలి ? తాళాలను ఎలా తొలగించాలనే విషయాలను యూట్యూబ్‌లో నేర్చుకున్నారు. ఇలా బీదర్‌లో చోరిచేసిన బైక్‌లను హైదరాబాద్‌లో.. హైదరాబాద్‌లో కొట్టేసిన వాహనాలను బీదర్‌లో అమ్మేవారు.

ఇదే క్రమంలో అగస్టు 28న అర్ధరాత్రి నగరంలో ఓ బైక్‌ దొంగతనం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో లంగర్‌హౌస్‌ పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా 100కు పైగా సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. టెక్నాలజీ సాయంతో అంచనా వేశారు. పోలీసుల స్పెషల్ టీమ్ పక్కా సమాచారంతో ముఠాను అరెస్ట్‌ చేశారు.

Also Read :

దొంగతనానికిి వచ్చి, గురకపెట్టి నిద్రపోయాడు

తన కల నెరవేరిందంటున్న పాయల్