Breaking: ఏపీలో మరో ఫ్యాక్టరీకి గ్యాస్ లీక్ కలకలం!
ఆంధ్రప్రదేశ్లోని మరో ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం విశ్వేస్వరరాయపురంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఐస్ ఫ్యాక్టరీలో అమ్మోనీయం గ్యాస్ లీకైంది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటు రెవెన్యూ, ఫైర్ సిబ్బంది కూడా హుటాహుటిన అక్కడికి వచ్చారు. ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, గతంలో వైజాగ్ పాలిమర్స్ పరిశ్రమ నుంచి వెలువడిన విష […]
ఆంధ్రప్రదేశ్లోని మరో ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం విశ్వేస్వరరాయపురంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఐస్ ఫ్యాక్టరీలో అమ్మోనీయం గ్యాస్ లీకైంది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అటు రెవెన్యూ, ఫైర్ సిబ్బంది కూడా హుటాహుటిన అక్కడికి వచ్చారు. ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, గతంలో వైజాగ్ పాలిమర్స్ పరిశ్రమ నుంచి వెలువడిన విష వాయువు కారణంగా ఐదు గ్రామాలు దయనీయ పరిస్థితిని ఎదుర్కున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు విడిచారు.
Read More:
జగన్ సర్కార్ మరో సంచలనం.. వారికి ఖాతాల్లోకి నేరుగా రూ. 10 వేలు..