Breaking: ఏపీలో మరో ఫ్యాక్టరీకి గ్యాస్ లీక్ కలకలం!

ఆంధ్రప్రదేశ్‌లోని మరో ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం విశ్వేస్వరరాయపురంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఐస్ ఫ్యాక్టరీలో అమ్మోనీయం గ్యాస్ లీకైంది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటు రెవెన్యూ, ఫైర్ సిబ్బంది కూడా హుటాహుటిన అక్కడికి వచ్చారు. ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, గతంలో వైజాగ్ పాలిమర్స్ పరిశ్రమ నుంచి వెలువడిన విష […]

Breaking: ఏపీలో మరో ఫ్యాక్టరీకి గ్యాస్ లీక్ కలకలం!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 18, 2020 | 8:01 PM

ఆంధ్రప్రదేశ్‌లోని మరో ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం విశ్వేస్వరరాయపురంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఐస్ ఫ్యాక్టరీలో అమ్మోనీయం గ్యాస్ లీకైంది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అటు రెవెన్యూ, ఫైర్ సిబ్బంది కూడా హుటాహుటిన అక్కడికి వచ్చారు. ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, గతంలో వైజాగ్ పాలిమర్స్ పరిశ్రమ నుంచి వెలువడిన విష వాయువు కారణంగా ఐదు గ్రామాలు దయనీయ పరిస్థితిని ఎదుర్కున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు విడిచారు.

Read More:

జగన్ సర్కార్ మరో సంచలనం.. వారికి ఖాతాల్లోకి నేరుగా రూ. 10 వేలు..

Breaking: ఏపీలో బస్సు సర్వీసులకు అనుమతి..