Murder in Visakha: విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పిల్లలను చంపేస్తాడేమో అని అనుమానంతో చివరికి భర్తనే అంతమొందించింది భార్య. ఈ ఘటన విశాఖపట్నంలోని చంగలరావు పేట ద్వారా వారి వీధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంగలరావుపేట ద్వారం వారి వీధిలో పుండరీకాక్షయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి మధ్య గత కొంత కాలంగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణ నేపథ్యంలోనే భర్త పుండరీకాక్ష్యయ్య పిల్లలను చంపేస్తాడేమో అని అనుమానించిన భార్య.. తీవ్ర భయబ్రాంతులకు గురైంది. ఈ క్రమంలోనే భర్తను రోకలిబండతో తలపై బలంగా కొట్టింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పుండరీకాక్షయ్య.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్థానికులు పోలీసులకు ఈ విషయాన్ని చేరవేయడంతో పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని పరిశీలించిన అధికారులు.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక భర్తను చంపిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు నిర్ధారించుకున్న పోలీసులు.. ఆమెపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.
Also read: