సూరంపల్లి పారిశ్రామికవాడలో పేలుడు.. ఇద్దరు మృతి

| Edited By:

Sep 03, 2020 | 3:43 PM

కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామికవాడలో పేలుడు సంభవించింది. జయరాజ్‌ ఫ్లైవుడ్‌ కంపెనీలో జరిగిన పేలుడులో

సూరంపల్లి పారిశ్రామికవాడలో పేలుడు.. ఇద్దరు మృతి
Follow us on

Plywood factory blast: కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామికవాడలో పేలుడు సంభవించింది. జయరాజ్‌ ఫ్లైవుడ్‌ కంపెనీలో జరిగిన పేలుడులో ఇద్దరు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. మృతులిద్దరు విజయవాడకు చెందిన తండ్రి, కొడుకులు అని సమాచారం. ఆ ఇద్దరు స్క్రాబ్‌ కొనుగోలుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మంత్రి అన్నారు. ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్య సాయాన్ని అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ ప్రమాదంపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ని ఆదేశించారు. మృతుల కుటుంబానికి ప్రభుత్వపరంగా అండగా ఉంటామని మంత్రి రామచంద్రారెడ్డి వెల్లడించారు.

Read More:

ఏపీలో ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం.. పట్టుబడితే శిక్షలివే

డ్రగ్స్ కేసు.. ప్రముఖ నటికి నోటీసులు