డ్రగ్స్ కేసు.. ప్రముఖ నటికి నోటీసులు
కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గత నెల డ్రగ్స్ను సరఫరా చేసే ముఠాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అరెస్ట్ చేసింది
Karnataka Drugs Case: కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గత నెల డ్రగ్స్ను సరఫరా చేసే ముఠాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అరెస్ట్ చేసింది. నిందితుల్లో ఒకరి డైరీని పోలీసులు స్వాధీనం చేసుకోగా.. అందులో సెలబ్రిటీల పేర్లు రాసి ఉన్నాయి. ఈ క్రమంలో ఈ కేసును పలు కోణాల్లో విచారిస్తోన్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసులు.. తాజాగా నటి రాగిణి ద్వివేదికి సమన్లు జారీ చేశారు. నేటి రాత్రిలోగా సీసీబీ ఎదుట హాజరు కావాలని ఆమెను ఆదేశించారు. విచారణలో ఆమెను పలు ప్రశ్నలు సందించబోతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు డ్రగ్స్ వాడే నటీనటులు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు తనకు తెలుసంటూ ప్రముఖ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ ప్రకటించగా.. ఆయనను పిలిచిన సీసీబీ అధికారులు స్టేట్మెంట్ తీసుకున్నారు. దీనిపై క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ సందీప్ పటేల్ మాట్లాడారు. ”ఇంద్రజిత్ లంకేష్ ఇప్పటికే పలువురి పేర్లను బయటపెట్టారు. మరోసారి ఆయనతో మాట్లాడుతాము. ఆయన మరిన్ని వివరాలు అందిస్తే దానికి అనుగుణంగా సాక్ష్యాలను సేకరిస్తున్నాము” అని అన్నారు. ఆయన చెప్పిన వివరాల ఆధారంగా మరి కొంతమంది నటులకు నోటీసులు అందించేందుకు సీసీబీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై బుధవారం కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాట్లాడుతూ.. ఈ కేసులో దోషులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
Read More: