Attack on TDP Leaders: ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్న ప్రధాన పార్టీ నేతలు.. తాడిపత్రిలో అర్థరాత్రి వేళ ఉద్రిక్తత..

|

Nov 24, 2022 | 10:01 AM

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో బుధవారం అర్థరాత్రి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలపైన వైసీపీ, టీడీపీకి చెందిన తాడిపత్రి లీడర్ల  పరస్పర దాడులతో ఉలిక్కిపడింది

Attack on TDP Leaders: ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్న ప్రధాన పార్టీ నేతలు.. తాడిపత్రిలో అర్థరాత్రి వేళ ఉద్రిక్తత..
Ananthapur Stone Pelters
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో బుధవారం అర్థరాత్రి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలపైన వైసీపీ, టీడీపీకి చెందిన తాడిపత్రి లీడర్ల  పరస్పర దాడులతో ఉలిక్కిపడింది ఆ ప్రాంతం. టీడీపీ లీడర్, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వైసీపీ వర్గలు తమపై దాడి చేశాయంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా అర్థరాత్రి సమయంలో.. వీధిలైైట్లు ఆపేసి మరీ దాడి చేశారు.

తాడిపత్రిలోని మూడోవార్డులో టీడీపీ నాయకుడు జేసీ అస్మిత్ రెడ్డి పర్యటిస్తుండగా ఆయనపై వైసీపీ శ్రేణులు..వీధిలైట్లు ఆపేసి మరీ రాళ్ల దాడి చేశారు. అయితే ఈ దాడిలో ఎలాంటి గాయాలు కాకుండానే ఆయన క్షేమంగా బయటపడ్డారు. వైసీపీ నాయకులు టీడీపీ నేతపై దాడికి దిగడంతో తాడిపత్రి మొత్తం రాత్రికి రాత్రే అల్లకల్లోలంగా మారింది.

అయితే, ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకోవడంతో .. రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు గాయపడ్డారు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. రాళ్లదాడిని ఆపేశారు. ఇరు పార్టీల వారిని చెదరగొట్టి, గాయపడ్డ వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..