Chandrababu: ఏపీ మరో శ్రీలంక కావడం కాదు, ఇప్పటికే ఆ పరిస్థితులు ఉన్నాయి.. వైసీపీపై చంద్రబాబు ఫైర్‌..

|

Jul 21, 2022 | 6:25 AM

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలం కావడం కాదని.. ఇప్పటికే ఏపీలో శ్రీలంక పరిస్థితులు ఉన్నాయని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో...

Chandrababu: ఏపీ మరో శ్రీలంక కావడం కాదు, ఇప్పటికే ఆ పరిస్థితులు ఉన్నాయి.. వైసీపీపై చంద్రబాబు ఫైర్‌..
Chandrababu
Follow us on

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలం కావడం కాదని.. ఇప్పటికే ఏపీలో శ్రీలంక పరిస్థితులు ఉన్నాయని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైసీపీ నిర్ణయాలతో ఏపీలో ఇప్పటికే శ్రీలంక పరిస్థితులు ఉన్నాయన్న ఆయన ఇందుకు పలు ఉదాహరణలు సైతం తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఉద్యోగులకు ఎప్పటి నుంచో సకాలంలో జీతాలు చెల్లించట్లేదు. జీపీఎఫ్ కూడా విత్ డ్రా చేసుకునే పరిస్థితి లేదు. పదవీ విరమణ చేసినవారికి చేయాల్సిన చెల్లింపులు సక్రమంగా చేయట్లేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేద’ని విమర్శించారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు కొత్త అప్పులు చేస్తున్నారని ధ్వజమెత్తిన చంద్రబాబు.. రహదారులకు మరమ్మత్తులు చేసే స్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదని విమర్శించారు.

ఇవన్నీ శ్రీలంక లాంటి పరిస్థితులు కావా.? అని ప్రశ్నించారు. పోలవరం నిర్లక్ష్యం ఎవరిదో కేంద్రమే నిర్ధారించింది అని అన్న చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం విషయంలో తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు టీడీపీపై ఎదురుదాడి చేస్తోందని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..