Strange Sounds in Village: అక్కడి జనానికి రోజు నిద్ర ఉండదు. పగలైనా…రాత్రైనా భయంతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే. కారణం ఏమిటో తెలియక..అయోమయంలో బతుకున్నారు. ఇంతకీ ఆ ఊరికేమైందో ఇప్పుడు తెలుసుకుందాం.. చూడటానికి పచ్చగా కనిపిస్తున్న ఈ పల్లెటూరి పేరు మదిరేబైలు. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంలో ఉన్న ఓ చిన్న గ్రామం. కొద్దిరోజుల క్రితం వరకు ఇక్కడి వాళ్లంతా ఆనందంగా జీవించారు. కానీ ఇప్పుడు కొన్ని రోజులనుంచి భయంతో వణికిపోతున్నారు. ఏక్షణాన ఏం జరుగుతుందో…ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం విరుచుకుపడుతుందోనన్న భయం గ్రామస్తుల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ మాట ఎందుకంటున్నామంటే…ఈఊళ్లో రాత్రి, పగలు తేడా లేకుండా ఆకాశం నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు రావడం, భూమి బద్దలైనట్లుగా.. భూమి కంపించడం వంటి ధ్వనులతో అంతా హడలిపోతున్నారు.
ఆకాశం నుంచి వచ్చే శబ్ధాలు వింటుంటే…ఏవైనా మీద పడతాయేమోనన్న అనుమానపడుతున్నారు. భూమి నుంచి వచ్చే సౌండ్తో భూకంపం ఏమైనా వస్తుందా అని డౌట్ పడుతున్నారు. ఈ సందేహాలతోనే రాత్రి వేళ గ్రామస్తులు ఎవరూ నిద్రకూడా పోకుండా జాగారం చేస్తున్నారు. పిల్లలు, వృద్ధులైతే ఈ శబ్ధాలకు మరింత ఆందోళన చెందుతున్నారు. ఓ పాత ఇల్లు కూలిపోవడం, ఇంట్లోని వస్తువులు కిందపడటం వంటి వాటిని ఉదాహరిస్తున్నారు.
ఈ మధ్యనే కురిసిన భారీ వర్షాలతో మదిరేబైలు గ్రామస్తుల్లో ఆందోళన మరింత పెరిగింది. విషయాన్ని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో శబ్ధాలు రావడానికి కారణాలు గుర్తించి…గ్రామస్తుల్లో ధైర్యం నింపాలని కోరుతున్నారు. ఈ శబ్దాలకు ఇళ్లు సైతం ధ్వంసమవుతున్నాయని పేర్కొంటున్నారు. దీంతో గ్రామస్థులు రాత్రి పూట జాగారం చేస్తూ గడుపుతున్నారు.
Also Read