చెన్నైతో పాటు ఏపీలో కురుస్తోన్న వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే కొన్ని రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించడంతో పాటు రీషెడ్యూల్ చేసింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగవ్వడంతో కొన్ని రైళ్లను పునరుద్ధరించింది. ఈ వివరాలను దక్షిణ మధ్య రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. కేవాడియా నుంచి చెన్నై సెంట్రల్ కు వెళ్లే రైలు (నెం.20920) ను బుధవారం రద్దు చేశారు. అలాగే పట్నా నుంచి బనస్వాడికి నడిచే రైలు (నెం.16054)ను గురువారం రోజు రద్దు చేశారు. వీటితో పాటు తిరుపతి-సికింద్రాబాద్ మద్య నడిచే రైలు (నెం 12763), తిరుపతి- సంత్రాగచ్చి రైలు(నెం.22856), తిరుపతి-కొల్హాపూర్(నెం.17415) రైళ్లను సోమవారం రద్దు చేసింది. ఇక మంగళవారం తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీ వెళ్లాల్సిన(నెం.17417) , బుధవారం సాయినగర్ షిర్డీ నుంచి తిరుపతికి రావాల్సిన రైలు(నెం.17418), గుంతకల్- రేణిగుంట రైలు(నెం. 07658)ను కూడా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
రైళ్ల పునరుద్ధరణ..
వరద ప్రభావం తగ్గడంతో సోమవారం నుంచి కొన్ని రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. యశ్వంత్ పూర్- హౌరా రైలు(నెం.12864), బెంగళూరు- కాకినాడ రైలు (నెం.17209), యశ్వంత్పూర్- పాటలీపుత్ర రైలు (నెం. 22352), చెన్నై సెంట్రల్- విజయవాడ రైలు (నెం.12712), అహ్మదాబాద్ – చెన్నై సెంట్రల్ రైలు (నెం.22920), మైసూరు- హౌరా రైలు (22818), బెంగళూరు- దానాపూర్ రైలు(నెం.12295), యశ్వంత్ పూర్-టాటానగర్ రైలు (నెం.12890), చెన్నై సెంట్రల్- పూరీ రైలు(22860), తిరునల్వేలి – శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా (నెం.16787) రైళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే వీటి వేళల్లో, రూట్లలో కొద్ది మార్పులు ఉంటాయని, ప్రయాణికులు వీటిని పరిగణనలోకి తీసుకొని ఏర్పాట్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
Bulletin No. 50, 51 & 52 SCR PR No. 587 on “Restoration / Cancellation / Diversion of Trains” @VijayawadaSCR @drmgtl @drmgnt pic.twitter.com/zTy6Dne4Ig
— South Central Railway (@SCRailwayIndia) November 22, 2021
Bulletin No. 53 SCR PR No. 588 on “Cancellation / Partial Cancellation of Trains ” @VijayawadaSCR @drmgtl pic.twitter.com/y5gzVqE8gU
— South Central Railway (@SCRailwayIndia) November 22, 2021
Tomato Price Hike: ఆల్ టైం హైకి టమాటా ధర.. చికెన్తో పోటీపడుతున్న కూరగాయలు.. సామాన్యుడి కంట కన్నీరు
AP Capital: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. 3 రాజధానుల బిల్లు ఉపసంహరణ.. అసలు ఏం జరిగిందంటే..?