AP Rains: అనంతపురం జిల్లాలో జోరుగా వరదలు.. ధర్మవరం చెరువు వరద నీటిలో చిక్కుకున్న యువకులు..

|

Nov 19, 2021 | 8:55 PM

ఏడుగురు యువకులు అవతలే చిక్కుకుపోయారు. కాపాడాలంటూ ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అయితే చీకటి పడడంతో..

AP Rains: అనంతపురం జిల్లాలో జోరుగా వరదలు.. ధర్మవరం చెరువు వరద నీటిలో చిక్కుకున్న యువకులు..
Dharmavaram Cheruvu
Follow us on

అనంతపురం జిల్లాలోని ధర్మవరం చెరువు నిండిపోవడంతో రెండో మరవ వద్ద ఏడుగురు యువకులు చిక్కుకుపోయారు. టీవీ9 స్క్రీన్‌పై ఎక్స్‌క్లూజివ్‌గా ఆ దృశ్యాల్ని చూస్తున్నారు. వాళ్లు ఎటూ వెళ్లలేని పరిస్థితి. చెరువు నిండుతోందని.. చిన్నూరుకు చెందిన యువకులు చూడ్డానికి వెళ్లారు. ఇంతలో వరద ఒక్కసారిగా పోటెత్తింది. చెరువు అలుగు పోయడం మొదలుపెట్టింది. దీంతో ఏడుగురు యువకులు అవతలే చిక్కుకుపోయారు. కాపాడాలంటూ ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అయితే చీకటి పడడంతో సహాయక చర్యలకు ఆంటంకం ఏర్పడింది. దీంతో రాత్రంతా ఆ ఏడుగురు యువకులు గట్టువద్దే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. తమ పిల్లలను కాపాడాలంటూ కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు.

ఇక చిత్రావతి నది ఉధృతికి గ్రామాలకు గ్రామాలే నీట మునిగాయ్. చిత్రావతి ఉగ్రరూపానికి కదిరి, పుట్టపర్తి పట్టణాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయ్. పుట్టపర్తిలో హనుమాన్, సత్యమ్మ దేవాలయాలు నీటిలో మునిగిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇవి కూడా చదవండి: Skin Care Tips: చలికాలంలో డ్రై స్కిన్‌తో బాధపడుతున్నారా.. అద్భుమైన చిట్కా మీకోసం.. ఇంట్లోనే చేసుకోండిలా..

MLA Roja: నాకు చాలా సంతోషంగా ఉంది.. బైబై బాబూ అంటూ రోజా సంచలన వీడియో