గుప్త నిధుల కోసం ఏకంగా ఇంట్లోనే తవ్వకాలు.. అర్థరాత్రి అలజడి.. చివరకు ఏమైందంటే..!

|

Aug 15, 2022 | 9:05 PM

గుప్త నిధుల కోసం ఏకంగా ఇంట్లోనే తవ్వకాలు జరిపాడు ఓ వ్యక్తి. పదిమంది కూలీలను పెట్టుకుని అర్ధరాత్రి అలజడి రేపాడు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనతో ఆ గ్రామమే హడలిపోయింది...

గుప్త నిధుల కోసం ఏకంగా ఇంట్లోనే తవ్వకాలు.. అర్థరాత్రి అలజడి.. చివరకు ఏమైందంటే..!
Follow us on

గుప్త నిధుల కోసం ఏకంగా ఇంట్లోనే తవ్వకాలు జరిపాడు ఓ వ్యక్తి. పదిమంది కూలీలను పెట్టుకుని అర్ధరాత్రి అలజడి రేపాడు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనతో ఆ గ్రామమే హడలిపోయింది. ఏలూరు జిల్లాలో జరిగిన ఈ గుప్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో ఏకంగా ఓ ఇంట్లోనే గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపడం భయాందోళనలు రేపింది. ఊరు మధ్యలో వేదాద్రి శ్రీనివాసరావు ఇంట్లో జరిపిన ఈ తవ్వకాలు గ్రామంలో టెన్షన్‌ పుట్టించాయి. తన ఇంట్లో నిధి నిక్షేపాలు ఉన్నాయంటూ తవ్వకాలు జరిపించాడు వేదాద్రి శ్రీనివాసరావు. ఇంటి మధ్యలో 15 అడుగుల మేర భారీ గొయ్య తవ్వించాడు. 10 మంది కూలీలను పెట్టుకుని పది రోజులుగా అర్ధరాత్రి తవ్వకాలు జరుపుతుండటంతో గ్రామస్తులు హడలిపోయారు. పాడుబడ్డ ఆ ఇంట్లో అసలేం జరుగుతుందో తెలియక భయపడ్డామంటున్నారు గొల్లపల్లి గ్రామస్తులు. అర్ధరాత్రి పూట ఇంట్లో నుంచి శబ్దాలు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భాగోతం బయటపడిందని చెబుతున్నారు.

గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అర్ధరాత్రి ఆ ఇంటిపై ఎటాక్‌ చేసిన పోలీసులు.. తవ్వకాలు జరుపుతోన్న ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. మరో ఐదుగురు పారిపోయారు. దాంతో వాళ్ల కోసం గాలిస్తున్నారు పోలీసులు. గుప్త నిధుల కోసం తవ్వకాల కోసం ఇంట్లో క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు బయటపడటంతో హడలిపోతున్నారు గ్రామస్తులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి