Andhra Pradesh: చిన్నారి పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం.. వైద్యం కోసం రూ.కోటి మంజూరు.. అంతే కాకుండా

|

Oct 03, 2022 | 6:37 AM

ప్రపంచంలోనే అరుదైన వ్యాధి. దేశంలో కేవలం 14 మంది మాత్రమే ఆ వ్యాధితో బాధపడుతున్నారు. అందుకు అయ్యే వైద్య ఖర్చు కోట్లలోనే. అలాంటి వ్యాధి ఆంధ్రప్రదేశ్ లో ఓ చిన్నారికి సోకింది. తమ బిడ్డను కాపాడాలని..

Andhra Pradesh: చిన్నారి పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం.. వైద్యం కోసం రూ.కోటి మంజూరు.. అంతే కాకుండా
Cm Ys Jagan
Follow us on

ప్రపంచంలోనే అరుదైన వ్యాధి. దేశంలో కేవలం 14 మంది మాత్రమే ఆ వ్యాధితో బాధపడుతున్నారు. అందుకు అయ్యే వైద్య ఖర్చు కోట్లలోనే. అలాంటి వ్యాధి ఆంధ్రప్రదేశ్ లో ఓ చిన్నారికి సోకింది. తమ బిడ్డను కాపాడాలని సీఎం ను కోరగానే చిన్నారి కోసం కోటి రూపాయలు మంజూరు చేశారు. అంతేకాదు చిన్నారి చదువు బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేశ్వరం గ్రామానికి చెందిన కొప్పాడి రాంబాబు, నాగలక్ష్మి దంపతులు. వీరికి రెండున్నరేళ్ల కుమార్తె ఉంది. పుట్టుకతోనే ఈ చిన్నారికి ప్రపంచంలోనే అరుదైన వ్యాధి సోకింది. గాకర్స్ అనే వ్యాధి చిన్నారి హనీకి రావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఈ వ్యాధి వల్ల లివర్ పనిచేయదు. అంతేకాదు ఈ వ్యాధి నివారణకు 52 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు లక్షా 25 వేలు. దీంతో కోటి రూపాయలు దాకా ఖర్చవుతుంది. ఏం చేయాలో దిక్కుతోచని హనీ తల్లిదండ్రులు సీఎం జగన్ తమకు అండగా ఉంటారని భావించారు.

ఐటీవల గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో కోనసీమ జిల్లా గంటి పెద్దపూడి లో ముఖ్యమంత్రి పర్యటించారు. పర్యటన ముగించుకుని బయలుదేరే సమయంలో తమ చిన్నారిని కాపాడాలని ప్లకార్డు ప్రదర్శించారు. వెంటనే అలర్ట్ అయిన సీఎం జగన్.. కాన్వాయ్ ను ఆపి వారితో మాట్లాడారు. తన వెంట హెలిపాడ్ వరకూ తీసుకెళ్లి వ్యాధికి సంబంధించిన వైద్యంపై ఆరా తీశారు. చిన్నారి ప్రాణాలు కాపాడడానికి అన్ని చర్యలు తీసుకోవాలని, ఎంత ఖర్చైనా పర్వాలేదని సీఎం అధికారులను ఆదేశించారు. వెంటనే ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ హిమాన్షు శుక్లాకు చెప్పారు. కలెక్టర్ ప్రతిపాదనలతో కోటి రూపాయలు మంజూరు చేశారు సీఎం జగన్.

ప్రస్తుతం 13 ఇంజెక్షన్లను అమలాపురం ఏరియా ఆసుపత్రిలో అందించారు. 15 రోజులకు ఒక ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. పాప చదువుకు కూడా ప్రభుత్వం సహకరిస్తుందని కలెక్టర్ చెప్పారు. ప్రతినెలా 10 వేలు పెన్షన్ కూడా ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సీఎం చొరవతో తమ పాప జీవితంపై ఆశ పెరిగిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సైతం పాప ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. సీఎం జగన్ తమకు ఎంతగానో సహాయం చేశారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి