AP: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. మాస్క్‌ లేకుండా రానిస్తే రూ.10 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా..!

| Edited By: Phani CH

Aug 01, 2021 | 8:04 AM

AP Corona Mask:కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం నిబంధనలు మరింత కఠినతరం చేసింది. మాస్క్‌ లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య..

AP: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. మాస్క్‌ లేకుండా రానిస్తే రూ.10 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా..!
Follow us on

AP Corona Mask:కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం నిబంధనలు మరింత కఠినతరం చేసింది. మాస్క్‌ లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్క్‌లు లేని వారిని అనుమతిస్తే రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. అయితే జరిమానా మొత్తాన్ని స్థానిక పరిస్థితుల ఆధారంగా ఖరారు చేస్తామని, అదే విధంగా 2-3 రోజుల పాటు సంబంధిత సంస్థలను మూసివేసేలా అధికారులు చర్యలు తీసుకుంటారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ శనివారం తెలిపారు.

కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి తమకు ఆ ఫోటోలు పంపితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దీనిక ఓసంప్రత్యేకంగా 8010968295 వాట్సప్ నెంబర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు వారాల పాటు రాత్రి వేళ కర్ఫ్యూను పొడిగించినట్లు తెలిపారు.

కాగా, ఆగస్టు 14వ తేదీ వరకూ కర్ఫ్యూ ఆంక్షలు ప్రతి రోజూ రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అందరూ కోవిడ్ ప్రోటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మాస్క్ లు ధరించని వారికి రూ.100 జరిమానా విధించే అధికారాన్ని ఎస్ఐ ఆపై పోలీసు అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని, ఇప్పటి వరకూ ఈ అధికారం వైద్యాధికారులకు మాత్రమే ఉండేదని అన్నారు. కరోనా కట్టడిలో భాగంగా నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నట్లు చెప్పారు.

ఇవీ కూడా చదవండి

TS Covid 19: తెలంగాణలో తగ్గని కరోనా వైరస్.. కొత్తగా 621 కేసులు నమోదు, ప్రస్తుతం 9 వేల యాక్టివ్ కేసులు

Japan Emergency: జపాన్‌లో కరోనా కల్లోలం.. ఎమ‌ర్జెన్సీ ప్రకటించిన సర్కార్.. టోక్యోతో సహా పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు