లారీ కారు ఢీకొన్న ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దునూరు మండలంలోని రైల్వే గేటు వద్ద కార్బన్ పౌడర్తో వెళ్తున్న లారీ అలాగే అటుగా వస్తున్న కారు ఇవీ రెండు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. లారీ ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న ఇంటిలోకి కారును తీసుకొని వెళ్ళింది. అంతే ఇంటి ముందు ఉన్న ఆటో నుజ్జునుజ్జు అయింది. ఆటోను ఇంట్లోకి దూసుకొని వెళ్ళిపోయింది. అంతే ఇంటి ముందు ఉన్న ఆటో నుజ్జునుజ్జు అయింది. ఆటోను ఢీకొంటూ ఒక్కసారిగా ఇంట్లోకి దూసుకొని వెళ్ళిపోయింది.
ఆటో పూర్తిగా దెబ్బతింది. దీంతో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటనపై ముదునూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ హెవీ లోడుతో ఉండడం వలన స్పీడ్ కంట్రోల్ చేయలేక ఇంట్లోకి దూసుకెళ్లినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా లారీ లోడ్ ఎక్కువగా ఉంది కాబట్టే ఆటోను ఢీ కొట్టిన ఆగకుండా ఇంట్లోకి దూసుకువచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..