Covid Relief Funds Scam: కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌లో భారీ మోసం.. 100 బిలియన్‌ డాలర్ల కుంభ కోణాన్ని గుర్తించిన సీక్రెట్‌ సర్వీస్‌

|

Dec 22, 2021 | 12:44 PM

Covid Relief Funds Scam: కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు, వ్యాపారాలు కోల్పోయిన వారికి సహాయం చేయడానికి ఏర్పాటు చేసిన కోవిడ్‌19 సహాయ కార్యక్రమాల నుంచి..

Covid Relief Funds Scam: కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌లో భారీ మోసం.. 100 బిలియన్‌ డాలర్ల కుంభ కోణాన్ని గుర్తించిన సీక్రెట్‌ సర్వీస్‌
Follow us on

Covid Relief Funds Scam: కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు, వ్యాపారాలు కోల్పోయిన వారికి సహాయం చేయడానికి ఏర్పాటు చేసిన కోవిడ్‌19 సహాయ కార్యక్రమాల నుంచి దాదాపు రూ.100 బిలియన్‌ డాలర్ల కుంభ కోణం జరిగినట్లు యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ మంగళవారం తెలిపింది. సీక్రెట్‌ సర్వీస్‌ కేసులు, లేబర్‌ డిపార్ట్‌మెంట్‌, స్మాల్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి వచ్చిన డేటా ప్రకారం అంచనాను గుర్తించారు. సీక్రెట్‌ సర్వీస్‌లో న్యాయ శాఖ ప్రాసిక్యూట్‌ చేసిన కోవిడ్‌ 19 ఈ కేసును చేర్చలేదు. ఈ మోసం కేసులు ఇప్పటి వరు 2.3 బిలియన్‌ డాలర్లకు పైగా నిధులను రికవరీ చేసింది. ఫలితంగా 100మందికిపైగా అనుమానితులను అరెస్టు చేసినట్లు సీక్రెట్‌ సర్వీస్‌ తెలిపింది. అయితే కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి యూఎస్‌ ప్రభుత్వం కోవిడ్‌ బాధితుల కోసం కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌లో సుమారు 3.5 ట్రిలియన్‌ డాలర్లను వెచ్చించింది.

ప్రెసిడెన్షియల్‌ ప్రొటెక్షన్‌లో నైపుణ్యం ఉన్నవారే ఈ నిధుల మోసానికి పాల్పడి ఉంటారని సీక్రెట్‌ సర్వీస్‌ భావిస్తోంది. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరుపుతోంది. ఇంకా ఎంత మంది ఉన్నారనే దానిపై ఆరా తీస్తోంది. మోసానికి పాల్పడిన వారి నుంచి నిధులను రికవరీ చేసేందుకు చర్యలు పడుతోంది. ఈ కేసు వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి రికవరీ కోఆర్డినేటర్‌ను నియమించినట్లు యూఎస్‌ ప్రకటించింది. 29 సంవత్సరాలకుపైగా చట్ట అమలులో క్లిష్టమైన మోసాలను పరిశోధనలు చేశానని, ఈ స్థాయిలో జరిగిన మోసం ఎన్నడు చూడలేదని అఇస్టెంట్‌ స్పెషల్‌ ఏజెంట్‌ ఇన్‌చార్జ్‌ రాయ్‌ డాట్సన్‌ చెబుతున్నారు. నిధులను రాబట్టెందుకు లోతైన దర్యాప్తు జరుగుతోందన్నారు.

మహమ్మారి సమయంలో జరిగిన మోసాలకు సంబంధించి సుమారు 900కుపైగా విచారణలు కొనసాగుతున్నాయని డాట్ సన్ తెలిపారు. న్యాయశాఖ గత వారం మోసానికి సంబంధించిన విభాగంలో 95 కంటే ఎక్కువ క్రిమినల్‌ కేసుల్లో 150 మంది నిందితులను ప్రాసిక్యూట్‌ చేసిందని, ఇందులో అనేక రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులు, లగ్జరీ వస్తువులను పొందిన వారి ఆదాయంలో 75 మిలియన్‌ డార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఈ ఫండ్‌ చట్ట అమలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డాట్సన్ తెలిపారు. కాగా, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాళ్లు కనీసం నాలుగు ఆన్‌లైన్‌ పెట్టుబడి ఖాతాలను తెరిచినట్లు సీక్రెట్‌ సర్వీస్‌ గుర్తించింది.

అయితే 2020 నుంచి కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి, వ్యాపారాలు కోల్పోయిన వారికి ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. కోవిడ్‌ కారణంగా నష్టపోయిన వారికి ఆదుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌లో ఇంత పెద్ద భారీ మోసం జరగడంపై చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి:

US: ఆ ఉగ్రవాద దాడిపై సమాచారమిస్తే 5 మిలియన్ల డాలర్ల రివార్డ్.. ప్రకటించింది ఎవరో తెలుసా..?

Dubai PM: భరణం కేసులో జాక్‌పాట్‌ కొట్టేసింది.. మాజీ భార్యకు దుబాయ్ ప్రధాన మంత్రి 728 మిలియన్ డాలర్ల భరణం