ఢిల్లీలో మరింత పటిష్టంగా సెక్యూరిటీ ఏర్పాట్లు
దీపావళి పండుగ రాబోతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు సెక్యూరిటీ ఏర్పాట్లను మరింత పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసేందుకు బుధవారం తుగ్లకాబాద్ పోలీసు రేంజిలో ఖాకీలు అత్యాధునిక ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీసు చేశారు. ఇందులో మహిళా పోలీసులు కూడా పాల్గొన్నారు. ఈ ప్రాక్టీసు లో ఏకే 47, ఎంపీ 5 వంటి మోడరన్ రైఫిళ్లను వాడడం విశేషం. దీపావళిని పురస్కరించుకుని ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి.. (కరోనా భయాన్ని కూడా పట్టించుకోకుండా) నానా […]
దీపావళి పండుగ రాబోతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు సెక్యూరిటీ ఏర్పాట్లను మరింత పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసేందుకు బుధవారం తుగ్లకాబాద్ పోలీసు రేంజిలో ఖాకీలు అత్యాధునిక ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీసు చేశారు. ఇందులో మహిళా పోలీసులు కూడా పాల్గొన్నారు. ఈ ప్రాక్టీసు లో ఏకే 47, ఎంపీ 5 వంటి మోడరన్ రైఫిళ్లను వాడడం విశేషం. దీపావళిని పురస్కరించుకుని ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి.. (కరోనా భయాన్ని కూడా పట్టించుకోకుండా) నానా హడావుడి చేసే అవకాశం ఉందని. ఆ నేపథ్యంలో ఏ విధమైన అలజడి జరగకుండా చూసేందుకు ఈ ఫైరింగ్ ప్రాక్టీసు చేశామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.