కర్నూలు హైవేపై రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి
కర్నూలు సమీపంలోని ఉలిందకొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు, ఒక ప్రయాణికుడు మృతి చెందారు. హైవేపై ఆగివున్న లారీని ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. లారీలో ఉన్న పైపులు బస్సులోకి చొచ్చుకురావడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పరిశీలించారు.
కర్నూలు సమీపంలోని ఉలిందకొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు, ఒక ప్రయాణికుడు మృతి చెందారు. హైవేపై ఆగివున్న లారీని ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. లారీలో ఉన్న పైపులు బస్సులోకి చొచ్చుకురావడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పరిశీలించారు.