Space Station: అంతరిక్ష పర్యాటకానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. అమెరికాకు చెందిన ఆక్సియోమ్ సంస్థ వచ్చే ఏడాది జనవరిలో ముగ్గురు పర్యాటకులను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపేందుకు సిద్దమైంది. స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా వీరిని అంతరిక్షంలోకి పంపనుంది.
దీనికి వారు ఒక్కోవ్యక్తి నుంచి మొత్తం రూ.400 కోట్లు ఐఎస్ఎస్కు తొలి ప్రైవేటు ప్లైట్ అని ఆక్సియోమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ప్రసిడెంట్ మైక్ సంఫ్రెదినివెల్లడించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (NASA)కు చెందిన మాజీ వ్యోమగామి మైఖెల్ లోపేజ్ సారథ్యంలో ముగ్గురు పర్యాటకులు అంతరిక్ష కేంద్రానికి చేరుకోనున్నారని తెలిపారు. ఐఎస్ఎస్లో వారం రోజుల పాటు గడుపుతారని వెల్లడించారు.
అయితే అక్కడికి చేరుకునేందుకు ఒకటి, రెండు రోజులు పడుతుందని చెప్పారు. ఆక్సియోమ్. తొలి కస్టమర్లలో రియల్ ఎస్టెట్, టెక్ ఎంటర్ ప్రెన్యూర్ ల్యారీ కానర్, కెనడా వ్యాపార వేత్త మార్క్ పాటీ, ఇజ్రాయెల్ పారిశ్రామిక వేత్త ఐటన్ స్టిబ్బె ఉన్నారు. 2003లో కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదంలో ప్రణాలు కోల్పోయిన ఇజ్రామెల్ తొలి వ్యోమగామి ఇలర్ రామోహన్కు ఐటన్ స్నేహితుడు. ఇదిలా ఉండగా, మరో వైపు 70 ఏండ్లకానర్, ఐఎస్ఎస్కు వెళ్లనున్న రెండో అతిపెద్ద వయస్కుడిగా గుర్తిండిపోయారు.
Also Read: Joe Biden: మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా కొత్త అధ్యక్షుడు… భారతీయులకు శుభవార్త…