ఇటలీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీ7 దేశాల సదస్సులో పాల్గొన్న విషయం తెలిసింది.. ఇటలీలోని బోర్గో ఎగ్నాజియా ప్రాంతంలో జరిగిన జీ7 దేశాల సదస్సులో పాల్గొన్న మోదీ.. పలు దేశాల అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.. ముందుగా ప్రధాని మోదీ – ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో భేటీ అయ్యారు. గతేడాది మెలోని భారత పర్యటన సందర్భంగా చర్చించిన అంశాల కొనసాగింపుగా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, టెలికాం, మరిన్ని రంగాలలో భారతదేశం-ఇటలీ సంబంధాలను మరింత పటిష్టం చేసే మార్గాల గురించి చర్చించినట్లు మోదీ తెలిపారు. అయితే.. గతంలో మాదిరి ఈసారి కూడా ప్రధాని మోదీ – ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని.. ప్రధాని మోదీతో సెల్ఫీ దిగి.. #Melodi ట్రెండ్ ను కొనసాగించారు. గత ఏడాది డిసెంబర్లో ఇంటర్నెట్లో వైరల్ అయిన #Melodi ట్రెండ్ను అనుసరించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇటాలియన్ కౌంటర్ జార్జియా మెలోని G7 సమ్మిట్లో కొత్త సెల్ఫీకి పోజులిచ్చారు. సమావేశాలు పూర్తయిన అనంతరం మోదీతో మెలోనీ సెల్ఫీ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇద్దరు నేతలు నవ్వుతూ సంతోషంగా సెల్ఫీ దిగారు. దీనికి సంబంధించిన వీడియోను జార్జియా మెలోని.. షేర్ చేసుకుంటూ.. Melodi (ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసేలా Giorgia Meloni – Narendra Modi) అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
గతేడాది (2023) డిసెంబర్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ వేదికగా జరిగిన ‘కాప్28’ సదస్సులో మోదీ, మెలోని సెల్ఫీ వైరల్ అయిన సంగతి తెలిసిందే. మోదీతో తీసుకున్న సెల్ఫీని మెలోనీ ఎక్స్లో షేర్ చేసి #Melodi హ్యాష్ట్యాగ్ను జతచేశారు. ఆ ఫొటోపై ప్రధాని మోదీ కూడా స్పందిస్తూ.. స్నేహితుల్ని కలుసుకోవడం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందంటూ రిప్లే ఇచ్చారు.. దీనికి కొనసాగింపుగా.. ఇప్పుడు మెలోని సెల్ఫీ షేర్ చేయగా.. నెట్టింట మళ్లీ ట్రెండ్ అవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..