బస్సులో చెలరేగిన మంటలు.. 26 మంది మృతి

బీజింగ్ : రెండు రోజుల ముందు చైనాలోని ఓ పారిశ్రామిక వాడలో జరిగిన పేలుడు ఘటన మరవక ముందే మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పర్యాటక బస్సులో మంటలు చెలరేగి 26 మంది చనిపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 26 మంది సజీవదహనం కాగా, మరో 30 మంది తీవ్రంగా […]

బస్సులో చెలరేగిన మంటలు.. 26 మంది మృతి
Follow us

| Edited By:

Updated on: Mar 23, 2019 | 10:35 AM

బీజింగ్ : రెండు రోజుల ముందు చైనాలోని ఓ పారిశ్రామిక వాడలో జరిగిన పేలుడు ఘటన మరవక ముందే మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పర్యాటక బస్సులో మంటలు చెలరేగి 26 మంది చనిపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 26 మంది సజీవదహనం కాగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 53 మంది పర్యాటకులు, ఒక టూరిస్టు గైడ్‌తో పాటు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. డ్రైవర్లిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తడంతోనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.