మహిళ ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. నడిరోడ్డుపై భార్యను దారుణంగా నరికి చంపిన భర్త

వివాహేతర సంబంధం ఒకమహిళా దారుణ హత్యకు దారితీసింది. తురుపు గోదావరి జిల్లా పెంటపాడు మండలంలో వివాహితను భర్త దారుణంగా హత్య చేశాడు ఆమె భర్త.

మహిళ ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. నడిరోడ్డుపై భార్యను దారుణంగా నరికి చంపిన భర్త
Follow us

|

Updated on: Dec 19, 2020 | 9:39 AM

వివాహేతర సంబంధం ఒకమహిళా దారుణ హత్యకు దారితీసింది. తురుపు గోదావరి జిల్లా పెంటపాడు మండలంలో వివాహితను ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. బైక్ పై వేరే వ్యక్తితో వెళ్తున్న ఆమెను అడ్డగించి మెడపై నరికి చంపాడు భర్త. వివరాల్లోకి వెళ్తే.. చిలకంపాడు గ్రామానికి చెందిన దువ్వారపు చంటియ్యకు అదే మండలం మొయ్యేరు గ్రామానికి చెందిన చంద్రికతో ఆరేళ్లక్రితం వివాహం జరిగింది. గత కొంతకాలంగా ఇద్దరికీ మధ్య తరుచు గోడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా చంద్రికాకు ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన కొమ్ము జెర్సీతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు కలిసి తిరగడం మొదలు పెట్టారు. ఆ తర్వాత భర్తను వదిలి అతడితో కలిసి గొల్లగూడెం గ్రామంలో నివసిస్తుంది చంద్రిక. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి భర్త నుంచి విడిపోదాం అనుకుంది. అదే సమయంలో  బైక్ పైన వస్తున్న జెర్సీ, చంద్రికను చంటియ్య అడ్డగించి వారితో వాగ్వాదం పెట్టుకున్నాడు. తనతో తెచ్చుకున్న కత్తితో చంద్రిక మెడ పై నరికి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన చంద్రిక అక్కడికక్కడే మృతిచెందింది. దాంతో జెర్సీ పోలీసులకు సమాచారం అందించగా.. కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు