ఉద్యోగాలు చైనీయులకా… అమ్మకాలు భారత్ లోనా… టెస్లాపై కేంద్ర మంత్రి ఫైర్.. వీడియో

|

Feb 21, 2022 | 8:45 AM

అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాకు భారత ప్రభుత్వం తరఫు నుంచి మరో ఎదురుదెబ్బ తగిలింది. కార్లను చైనాలో తయారు చేసి భారత్ లో విక్రయిస్తే రాయితీలు ఇవ్వబోమని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి క్రిషన్ పాల్ గుర్జర్ లోక్ సభలో స్పష్టం చేశారు.


అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాకు భారత ప్రభుత్వం తరఫు నుంచి మరో ఎదురుదెబ్బ తగిలింది. కార్లను చైనాలో తయారు చేసి భారత్ లో విక్రయిస్తే రాయితీలు ఇవ్వబోమని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి క్రిషన్ పాల్ గుర్జర్ లోక్ సభలో స్పష్టం చేశారు.
కార్ల తయారీ చైనాలో చేసి అక్కడ ఉద్యోగాలు కల్పిస్తూ.. వాటిని మన దేశంలో అమ్మడం సరికాదని అన్నారు. ప్రభుత్వ పరంగా అందిస్తు్న్న వివిధ రాయితీ పథకాలకు టెస్లా ఇప్పటివరకు ఎటువంటి అభ్యర్థన చేయలేదని అన్నారు. లోక్ సభలో అడిగిన ప్రశ్నకు బదులుగా.. మోదీ ప్రభుత్వ పాలసీ ప్రకారం భారత విపణిలో లబ్ధి పొందాలనుకునే కంపెనీలు దేశంలోని వారికి ఉపాధి అవకాశాలు కలిగించేవిగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు.వాయిస్‌02: గతంలో మస్క్ ఎలక్ట్రి వాహనాలపై దిగుమతి సుంకాలు తగ్గించాలంటూ చేసిన విజ్ఞప్తి తెలిసిందే. దీనికి తోడు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సైతం టెస్లా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Follow us on