వ్యాపారులు తమ బిజినెస్ పెంచుకోడానికి రకరకాల మార్గాలు అవలంభిస్తారు. పలు రకాల ఆఫర్లు ప్రకటిస్తారు. తాజాగా ఓ చికెన్ వ్యాపారి తన వ్యాపారం పెంచుకునే క్రమంలో భారీ ఆఫర్ ప్రకటించాడు. దాంతో చికెన్ ప్రియులంతా అతని షాపుముందు బారులు తీరారు. వివరాల్లోకి వెళ్తే…సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కనకదుర్గ చికెన్ సెంటర్ అనే షాపుముందు ఒక బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డుపైన 155 రూపాయలకే కిలో చికెన్ అని రాసి ఉంది. అంతేకాకుండా మాంసం ప్రియులను ఆకట్టుకునేందుకు రారమ్మని పిలుస్తూ మైకు ద్వారా ప్రచారం చేస్తున్నారు. అసలే ఆదివారం..చికెన్ ప్రియులు ఊరికే ఉంటారా.. వెంటనే ఆ షాపు ముందు భారీగా క్యూకట్టారు. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ రేట్ 280 నుండి 300 రూపాయలు పలుకుతోంది. మరి ఇతను మాత్రం ఇంత తక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నాడు అనేది ప్రశ్నగా మిగిలింది. కొందరు మాత్రం వ్యాపారం పెంచుకోడానికే అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?