ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలకు 238 ఏళ్ల చరిత్ర కలిగిన బారా ఇమాంబర పారాపెట్ కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే సైట్ ఇన్ఛార్జ్ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు.. త్వరలోనే పునరుద్ధరిస్తామన్నారు. స్మారక చిహ్నాం భారీ వర్షాల కారణంగా పారాపెట్ పడిపోవడం దురదృష్టకరమని అధికారులు విచారం వ్యక్తం చేశారు. అయితే, భారతదేశంలోని ఈ ఐకానిక్ హెరిటేజ్ భవనం సరైన నిర్వహణ లేకపోవడంతోనే భవనం బలహీనపడిందని, ఇప్పుడు కూలిపోయే పరిస్థితికి దారితీసిందని స్థానికులు మండిపడుతున్నారు. 1784లో అవధ్ నవాబ్ అసఫ్-ఉద్-దౌలాచే లక్నోలో నిర్మించిన ఇమాంబర సముదాయాన్ని అసఫీ ఇమాంబరాగా కూడా పిలుస్తారు. ఈ ఇమాంబరా నిజామత్ ఇమాంబరా తర్వాత రెండవ అతిపెద్దది. బారా ఇమాంబర నిర్మాణం 1780లో ప్రారంభించారు. ఇమాంబర నిర్మాణానికి అప్పట్లో అర మిలియన్ రూపాయల ఖర్చు చేశారు. పూర్తయిన తర్వాత కూడా, నవాబు దాని అలంకరణ కోసం సంవత్సరానికి నాలుగు నుండి ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు చేసేవాడని సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..