Hyderabad Drug Case: డ్రగ్స్‌ కేసులో కొత్త ట్విస్ట్‌.! చెల్లె కోసం పోలీస్‌ స్టేషన్‌కు అక్క..

|

Mar 01, 2024 | 12:12 PM

ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోన్న రాడిసన్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఏ- 10 నిందితుడిగా డైరెక్టర్ క్రిష్ పేరును పోలీసులు చేర్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో చిక్కుకున్న తన చెల్లెలు లిషిత కనపడేటం లేదు అంటూ గచ్చిబౌలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె సొదరి హీరోయిన్ కుషిత.

ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోన్న రాడిసన్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఏ- 10 నిందితుడిగా డైరెక్టర్ క్రిష్ పేరును పోలీసులు చేర్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో చిక్కుకున్న తన చెల్లెలు లిషిత కనపడేటం లేదు అంటూ గచ్చిబౌలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె సొదరి హీరోయిన్ కుషిత. డ్రగ్స్ వార్తలు వచ్చినప్పటి నుండి తన చెల్లెలు కనపడటం లేదు అంటూ తన ఫిర్యాదులో పేర్కొంది కుషిత. ఇప్పటికే లిషిత ఇంటికి నోటీసులు పంపించారు పోలీసులు. మరోవైపు లిషిత కావాలనే విచారణకు రావటం లేదంటున్నారు వారు. విచారణకు కచ్చితంగా రావాలని ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే ఆమె కనిపించడం లేదంటూ.. ఆమె అక్క కుషిత పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇక రెండేళ్ల క్రితం హైదరాబాద్ రాడిసన్ హోటల్లో ఉన్న పబ్ లో జరిగిన సోదాల్లో పలువురు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల పిల్లలు.. వీఐపీ పిల్లల పేర్లు బయటకు వచ్చాయి. అప్పట్లో ఈ కేసు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆ కేసులో ఇప్పటికీ కొందరిని విచారిస్తూనే ఉన్నారు. అదే సమయంలో నటి కుషిత కళ్లపు మీద కూడా డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. అయితే తాము కేవలం చీజ్ బజ్జిలు తినడానికి మాత్రమే వెళ్లామని.. డ్రగ్స్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. దీంతో అప్పట్లో కుషిత మాటలపై తెగ ట్రోల్స్ జరిగాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us on