Viral Photo: ట్రాఫిక్ నిబంధనలను పాటించే క్రమంలో, వాహనదారులను అలర్ట్ చేసేందుకు పోలీసులు ఎన్నో రకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ట్రాఫిక్ చలాన్లను విధిస్తున్నా, చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి నిబంధలను ఉల్లంఘించిన వారిని అరెస్ట్లు చేస్తున్నా కొందరు మాత్రం మారడం లేదు. పదే పదే చేసిన తప్పు చేస్తున్నారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మద్యం సేవించి వాహనం తాగుతూ తమ ప్రాణాలనే కాకుండా పక్కన వారి ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. డ్రంక్ డ్రైవ్ చేయకండని పోలీసులు రకరకాల ప్రచారాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తున్నా మార్పు మాత్రం రావడం లేదు.
ఈ నేపథ్యంలో తాజాగా కులుమానాలి పోలీసులు ఏర్పాటు చేసిన ఓ హోర్డింగ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంతకీ అక్కడి పోలీసులు ఏర్పాటు చేసిన బోర్డ్పై ఏముందంటే. ‘మద్యం తాగి వాహనం నడపకండి. మనాలి జైలులో విపరీతమైన చలి ఉంది’ అని రాసి ఉంది. అంటే మద్యం తాగి వాహనాన్ని నడిపిస్తే జైలుకు పంపుతామని చెప్పకనే చెప్పారన్నమాట.
వైరల్ అవుతోన్న బోర్డ్ ఇదే..
ఇదే బోర్డ్పై ‘సిగరెట్లు ఊపిపిరిత్తులను కాల్చేస్తాయి’ అని కూడా రాసుంది. ప్రస్తుతం ఈ బోర్డ్కు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. కులుమనాలి పోలీసుల ట్యాలెంట్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..