Anand Mahindra: సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఒకరు. సమాజంలో జరిగే అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారాయన. ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్టులు చేస్తూ చర్చకు దారి తీస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆనంద్ మహీంద్ర చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. తాజాగా గుజరాత్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని రాజ్ కోట్ పట్టణం వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. రోడ్లపై నీరు వాగులను తలపించింది. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితిలోనూ అక్కడి పోలీసులు రెస్క్యూ కోసం వరద నీటిలో కారులో వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది.
అయితే ఈ వీడియోలో పోలీసులు ప్రయాణించింది మహీంద్ర కంపెనీకి చెందిన బొలేరో కంపెనీకి కావడం గమనార్హం. దీంతో ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి ‘మహీంద్రాకు ఇది సాధ్యమే’ అనే క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ వీడియో వైరల్ అవుతూ చివరికి ఆనంద్ మహీంద్ర కంట పడింది. దీంతో ఈ ట్వీట్ను రీట్వీట్ చేసిన ఆనంద్.. ‘ఇది నిజమేనా..?ఇటీవల వర్షాలు కురిసిన సమయంలోనేనా? నేను కూడా ఆశ్చర్యపోతున్నాను’ అంటూ క్యాప్షన్ జోడించారు. నెట్టింట వైరల్ అవుతోన్న ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
Seriously? During the recent rains? Even I am pretty amazed. https://t.co/Co5nve9uwd
— anand mahindra (@anandmahindra) September 14, 2021
ఇదంతా బాగానే ఉంటే ఇక్కడే అస్సలు రచ్చ మొదలైంది.. ఇంతకీ ఆనంద్ మహీంద్ర పొగిడింది అంత సాహసం చేస్తూ వరద నీటిలో ప్రయాణం చేసిన పోలీసులునా.? లేదా మహీంద్ర కంపెనీకి చెందిన వాహనాన్నా.? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Viral Photo: ఈ ఫొటోలో ముద్దులొలికేలా ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడీమె ఓ బడా హీరోయిన్..