దేశ వ్యాప్తంగా గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. రాజస్థాన్లో సరికొత్త రికార్డ్.. కశ్మీర్లో మరీ దారుణం..
దేశం వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు దారుణంగా పడిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు
దేశం వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు దారుణంగా పడిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తాజాగా హస్తినా 3-4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక దక్షణాదిలోనూ అదే పరిస్థితి నెలకొంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి పంజా విసురుతోంది. జనం చలికి వణికిపోతున్నారు. పొగమంచు కప్పేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నేడు దేశ రాజధాని ఢిల్లీలో ఈ సీజన్లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇవాళ ఉదయం 3.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రాజస్థాన్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఎన్నడూ లేని విధంగా మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మౌంట్ అబూ వద్ద మైనస్ 1 డిగ్రీ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యింది. దాంతో అక్కడ నీరు గడ్డకట్టింది. కొన్ని చోట్ల కాలువులు, నీటి గుంటలపై మంచు తెరలు ఏర్పడ్డాయి. అయితే రాజస్థాన్లో ఈ తరహా పరిస్థితి చూడటం ఇదే తొలిసారి అని పర్యాటకులు చెబుతున్నారు.
ఇక జమ్మూకశ్మీర్లో అయితే పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవాళ జమ్మూకశ్మీర్లో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. శ్రీనగర్లో మైనస్ 6.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఖాజీగండ్- మైనస్ 5.7, ఫహల్గామ్- మైనస్ 7.7, కుప్వారా- మైనస్ 5.6, గుల్మర్గ్-మైనస్ 7.5, అనంత్నాగ్- మైనస్ 5.7, గండెర్బల్- మైనస్ 4.0, లేహ్ – మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
Also read: