D Srinivas: సొంత గూటికి డీఎస్.. సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న ఎంపీ..

|

Jan 16, 2022 | 5:03 PM

MP D Srinivas to Return to Congress: టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌ (డీఎస్) సొంత గూటికి చేరబోతున్నారు. గత కొంతకాలం

D Srinivas: సొంత గూటికి డీఎస్.. సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న ఎంపీ..
D Srinivas
Follow us on

MP D Srinivas to Return to Congress: టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌ (డీఎస్) సొంత గూటికి చేరబోతున్నారు. గత కొంతకాలం నుంచి టీఆర్ఎస్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న డీఎస్ (D Srinivas)  కాంగ్రెస్‌లో చేరేందుకు ముహుర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఈనెల 24న అధినేత సోనియాగాంధీ సమక్షంలో డీఎస్ కాంగ్రెస్‌ (Congress) పార్టీలో చేరనున్నారు. గత కొంతకాలంగా ఎంపీ డీ శ్రీనివాస్ టీఆర్‌ఎస్‌లో ఇమడలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఆయన రాజకీయంగా కాంగ్రెస్‌ పార్టీతోనే ఎదిగారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం ఆయన టీఆర్ఎస్ (TRS) పార్టీలో చేరారు. ఆ తర్వాత పార్టీ డీఎస్‌ను రాజ్యసభకు పంపించింది. అయితే కొంత కాలానికే సీఎం కేసీఆర్‌కు, డీఎస్ మధ్య దూరం పెరిగిపోయింది. దీంతో ఆయన ఈ విషయాన్ని పలుమార్లు బహటంగానే వెల్లడించారు.

కాగా.. ఇటీవల డీఎస్ అనారోగ్యం బారిన పడటంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కుసుమ్‌ కుమార్‌ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. అప్పటినుంచి ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారన్న ప్రచారం ఊపందుకుంది. కాగా.. డీఎస్‌ పెద్ద కుమారుడు సంజయ్‌ ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

Also Read:

Telangana: ఉస్మానియా, జెఎన్టీయూ పరిధిలో ఆన్‌లైన్ క్లాసులు.. ఎప్పటివరకంటే..?

MMTS Trains: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. పలు మార్గాల్లో రైళ్లు రద్దు..