Telangana: టికెట్ ధ‌ర‌లపై టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ

|

Oct 14, 2024 | 3:45 PM

బ‌తుక‌మ్మ, ద‌స‌రా పండుగ నేప‌థ్యంలో టీజీఎస్ఆర్టీసీ విప‌రీతంగా టికెట్ ధ‌ర‌లు పెంచింద‌ని జ‌రుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. జీవో ప్రకారం స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్రమే చార్జీల‌ను సంస్థ స‌వ‌రించినట్లు ఆయన ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు.

Telangana: టికెట్ ధ‌ర‌లపై టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ
Vc Sajjanar
Follow us on

బ‌తుక‌మ్మ, ద‌స‌రా పండుగ నేప‌థ్యంలో టీజీఎస్ఆర్టీసీ విప‌రీతంగా టికెట్ ధ‌ర‌లు పెంచింద‌ని జ‌రుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. జీవో ప్రకారం స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్రమే చార్జీల‌ను సంస్థ స‌వ‌రించినట్లు ఆయన ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. ప్రధాన పండుగులైన సంక్రాంతి, ద‌స‌రా, రాఖీ పౌర్ణమి, వినాయ‌క చ‌వితి, ఉగాది, త‌దిత‌ర స‌మయాల్లో హైద‌రాబాద్ నుంచి ప్రయాణికులు ఎక్కువ‌గా సొంతూళ్లకు వెళ్తుంటారు. ఈ సంద‌ర్బాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను ఆర్టీసీ యాజ‌మాన్యం నడుపుతుంది. రద్దీ మేరకు హైద‌రాబాద్ సిటీ బ‌స్సుల‌ను కూడా జిల్లాల‌కు తిప్పుతుంది. తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల ర‌ద్దీ ఉండ‌క‌పోవ‌డంతో ఖాళీగా ఆ బ‌స్సులు వెళ్తుంటాయి. ఆ స్పెష‌ల్ బ‌స్సుల‌కు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధ‌ర‌ను స‌వ‌రించుకోవాలని 2003లో జీవో నంబర్ 16ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పండుగ‌ల స‌మ‌యాల్లో న‌డిచే స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్రమే రూ.1.50 వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ను స‌వ‌రించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.

 

మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు త‌ర్వాత ఆర్టీసీ బ‌స్సుల్లో 25 శాతం మేర ర‌ద్దీ పెరిగిందని తెలిపారు. టీజీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం 9 వేల‌కు పైగా బ‌స్సులు సేవ‌లందిస్తున్నట్లు వెల్లడించారు. పండుగ స‌మ‌యాల్లో ర‌ద్దీకి అనుగుణంగా ప్రతి రోజు స‌గ‌టున 500 స్పెష‌ల్ బ‌స్సులను సంస్థ న‌డుపుతుందన్నారు. ఆ 500 స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్రమే చార్జీల సవరణ ఉంటుందని, మిగ‌తా 8500 రెగ్యుల‌ర్ స‌ర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండ‌దని ఆయన స్పష్టం చేశారు.

టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చేసిన ట్వీట్ ఇదిగో:


టికెట్ ధరల పెంపుపై తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఆర్టీసీ టికెట్ ధరలు విపరీతంగా పెంచి బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్ళకు వెళ్లిన ప్రయాణికుల నుండి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గమన్నారు. టికెట్ ధర రూ.140తో జేబీఎస్ నుండి సిద్దిపేటకు వెళ్లిన ప్రయాణికుడు తిరుగు ప్రయాణంలో టికెట్ ధర రూ. 200 చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నా్రు. హన్మకొండ నుండి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణం సాధారణ రోజుల్లో రూ. 300 ఉంటే, పండుగ వేళ ప్రభుత్వం పెంచిన చార్జీ రూ.420 ఉందన్నారు. బస్సుల సంఖ్య పెంచకుండా, టెకెట్ ఛార్జీలు పెంచి తెలంగాణ ప్రజలకు పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమే ప్రజాపాలననా అని ఆయన మండిపడ్డారు.