ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న తెలంగాణ ప్రభుత్వం “ఆరోగ్య మహిళ” కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. ఇందుకోసం సీఎం సూచనల మేరకు వైద్యారోగ్య శాఖ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది. మహిళలు ప్రధానంగా ఎదుర్కునే 8 రకాల ఆరోగ్య సమస్యలపై వైద్యారోగ్య శాఖ ఫోకస్ పెట్టింది. ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర మహిళలకు బహుమతిగా ఈ హెల్త్ స్కీమ్ తీసుకొస్తుంది. ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు అందించబోతుంది. మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో ఈ సేవలు ప్రవేశ పెట్టనున్నారు మొత్తం 1200 పీహెచ్ సి, యూపిహెచ్సీ, బస్తి దావాఖనా కేంద్రాలకు విస్తరించాలని యోచిస్తున్నారు.
ఈ పరీక్షలు అన్నీ ఉచితంగానే చేస్తారు. ప్రత్యేక యాప్ ద్వారా మానిటరింగ్ ఉంటుంది. తెలంగాణ డయాగ్నొస్టిక్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారు. సమస్యలు ఉన్నవారిని రెఫరల్ సెంటర్లు, ప్రభుత్వ పెద్దాసుపత్రులకు పంపుతారు. సంబంధిత మహిళకు పూర్తిగా నయం అయ్యే దాకా వైద్య సేవలు అందించే కార్యక్రమం ఉంటుంది. రిఫరల్ ఆసుపత్రుల్లో మహిళలకు సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఉంటాయి. ఈ ప్రత్యేక సేవల గురించి మహిళా సంఘాలు, మెప్మా వారికి అవగాహన కల్పించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి