Telangana CM Kcr: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, ప్రమోషన్లు, ఇతర సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ను ఆదేశించారు. అలాగే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే త్రిసభ్య కమిటీ చర్చలను ప్రారంభించాలని సీఎస్కు ఆదేశాలు చేశారు. వారం, పది రోజుల్లోగా చర్చల ప్రక్రియను పూర్తి చేసి నివేదికను తనకు సమర్పించాలని ఆదేశాల్లో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, ఉద్యోగ సమస్యలు, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి అంశాలపై ఇటీవల ముఖ్యమంత్రి సమీక్షించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఉద్యోగులకు పీఆర్సీ త్వరలోనే ప్రకటిస్తామని కూడా సీఎం కేసీఆర్ తెలిపారు. ఆ మేరకు చర్యలను వేగవంతం చేసేలా సీఎం కేసీఆర్ తాజా ఆదేశాలు జారీ చేశారు.
Also read:
Tiger: పులితో ఆటలు… వైరల్గా మారిన యువకుల వీడియో… ఇలా చేయడం మంచిది కాదంటూ..