Road Accident: హైదరాబాద్లోని బాలానగర్ పరిధిలో గల బీహెచ్ఈఎల్ ఆర్&డీ కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మైనర్ బాలురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ బాలురైన కుమార్, లోకేష్, అభివన్ లు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నారు. బిహెచ్ఈఎల్ ఆర్&డీ కాలనీ వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టింది. దాంతో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రంగా గాయలయ్యాయి. వీరిలో కుమార్ తలకు తీవ్ర గాయాలవడంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మైనర్ బాలురైన వీరు ద్విచక్ర వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదానికి గురైన ముగ్గురు బాలులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read: