తెలంగాణలో అడవులను అమ్ముకుంది ఎవరు? మీరు కాదా.. ! ఫారెస్ట్ అధికారులకు ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ సూటిప్రశ్న

|

Feb 10, 2021 | 6:44 PM

ఒకప్పుడు తెలంగాణలో అడవులను నాశనం చేసింది ఎవరు? అడవులను అమ్ముకుంది ఎవరు? మీరు కాదా.. ! అలాంటి మీరు పోడు సాగుతో భూములు..

తెలంగాణలో అడవులను అమ్ముకుంది ఎవరు? మీరు కాదా.. ! ఫారెస్ట్ అధికారులకు ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ సూటిప్రశ్న
Follow us on

ఒకప్పుడు తెలంగాణలో అడవులను నాశనం చేసింది ఎవరు? అడవులను అమ్ముకుంది ఎవరు? మీరు కాదా.. ! అలాంటి మీరు పోడు సాగుతో భూములు నాశనం అవుతున్నాయంటూ గందరగోళం సృష్టిస్తారా? ఇకపై ఖబడ్దార్‌ అంటూ చాలా సూటిగా.. ఘాటుగా కామెంట్ చేశారు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌. అయితే ఆయన ఈ మాటలన్నది ఎవరో రాజకీయ నాయకులను కాదు.. ఫారెస్ట్ అధికారులను. పోడు భూముల్లో కందకాలు తవ్వితే ఒక్క ఫోన్ కొట్టండి చాలు, అర్థరాత్రి అపరాత్రి అయినా వచ్చేస్తానంటూ గిరిజనానికి భరోసా ఇచ్చారు. కేసీఆర్ చెప్పిటన్లు ఫారెస్ట్ అధికారులు స్టేటస్ కో పాటించారా సరే, లేదంటే రైతులు గుణపాఠం చెబుతారంటూ హెచ్చరించారు శంకర్ నాయక్.

తెలంగాణలో చర్చంతా కొత్త జెండా పైనే, షర్మిళ ఎవరు వదిలిన బాణమని సర్వత్రా మీమాంస.!