Pawan Kalyan: రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ పర్యటన.. కార్యకర్త కుటుంబానికి పరామర్శ

|

May 19, 2022 | 10:43 AM

జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) ఈ నెల 20న (రేపు) తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ(Nalgonda) జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఆయన రానున్నట్లు....

Pawan Kalyan: రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ పర్యటన.. కార్యకర్త కుటుంబానికి పరామర్శ
Pawan Kalyan
Follow us on

జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) ఈ నెల 20న (రేపు) తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ(Nalgonda) జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఆయన రానున్నట్లు ఆ పార్టీ నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జ్ మేకల సతీష్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్తూ.. మార్గమధ్యంలో చౌటుప్పల్‌లో ఆగుతారని చెప్పారు. వలిగొండ మండలం గోపరాజుపల్లికి చెందిన పార్టీ కార్యకర్త సైదులు రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించారు. అతని భార్య, పిల్లలను పరామర్శించేందుకు పవన్‌కల్యాణ్‌ రానున్నారు. ఇందుకు సంబంధించి చౌటుప్పల్‌లో జనసేన కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి నుంచి హుజూర్‌నగర్‌కు చెందిన జన సైనికుడు శ్రీనివాస్ కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తారని వెల్లడించారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. లక్కారం గ్రామాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన ఇన్‌ఛార్జి మేకల సతీష్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి గురువారం రాత్రి సందర్శించారు. ఇక్కడి జనసేన కార్యకర్తలతో పర్యటన ఏర్పాట్లపై చర్చించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

Foot Skin Care Tips: వేసవిలో మీ పాదాలను అందంగా ఉంచుకోవాలా..? ఈ చిట్కాలను పాటించండి..!

Deer Viral Video: ఒక్క జంప్ తో వ్యక్తిని మట్టికరిపించిన జింక..! వీడియో చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా డౌటే..!