Hyderabad: భూవివాదంలో మాజీ మంత్రి.. పోలీసుల అదుపులో మల్లారెడ్డి

|

May 18, 2024 | 1:08 PM

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య భూవివాదం నేపథ్యంలో పోలీసులు ఇద్దరినీ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెం.82లోని తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్‌ వేశారని మల్లారెడ్డి పోలీసులకు చెప్పారు.

Hyderabad: భూవివాదంలో మాజీ మంత్రి.. పోలీసుల అదుపులో మల్లారెడ్డి
Malla Reddy
Follow us on

హైదరాబాద్‌, మే 18: మాజీ మంత్రి మల్లా రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య భూవివాదం నేపథ్యంలో పోలీసులు ఇద్దరినీ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెం.82లోని తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్‌ వేశారని మల్లారెడ్డి పోలీసులకు చెప్పారు. వేసిన ఫెన్సింగ్‌ను కూల్చాలంటూ అనుచరులకు చెప్పారు మల్లారెడ్డి. దీంతో అనుచరులు ఈ ఫెన్సింగ్ మొత్తం నేలకూల్చారు. వివాదంలోని భూమిలో ఘర్షణకు దిగొద్దని ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. దీనిపై పోలీసులతో పెద్దగా వాగ్వాదానికి దిగారు మల్లా రెడ్డి.

తమ భూమిలో ఫెన్సింగ్‌ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ పోలీసులను నిలదీశారు. కేసు పెడితే పెట్టుకోండి.. తన స్థలాన్ని కాపాడుకుంటానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ముందే మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్‌ను కూల్చి వేశారు. గతంలోకూడా ఆ భూమి మాదేనంటూ 15 మంది బయటకు వచ్చారన్నారు. ఇదిలా ఉంటే ఫెన్సింగ్ వేసిన వాళ్లు పోలీసులతో స్థలంపై స్పష్టత ఇచ్చారు. ఒక్కొక్కరు 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామన్నారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని కోర్టు ఆర్ఢర్‎ను పోలీసులకు చూపించారు. స్థలంపై కోర్టు ఆర్డర్‌ ఉన్నందున సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసులు ఇరువురికి సూచించారు. ఇదే క్రమంలో మల్లా రెడ్డి అనుచరులు ఫెన్సింగ్‎ను కూల్చి వేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పరిస్థితి సర్ధుమణిగేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి‎ని బషీర బాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..