జైలులో రిమాండ్ ఖైదీ హైడ్రామా.. సూపర్ యాక్టింగ్‎తో కంగుతిన్న జైలు అధికారులు..

భర్త దారుణ హత్య కేసులో‌ ఏ 1 నిందితురాలుగా జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ నిందుతురాలు జైలు నుండి బయటపడేందుకు సూపర్ క్వీన్ యాక్టింగ్ ప్రదర్శించింది. ఆత్మహత్య చేసుకున్నాని.. ప్రాణాలు పోతున్నాయంటూ గొంతు పట్టుకుని కేకలు వేసింది. నిజమేనని నమ్మిన జిల్లా జైలు సిబ్బంది నిందితురాలి ప్రాణాలు కాపాడేందుకు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి ‌తరలించారు. పరీక్షించిన వైద్యులు నిందితురాలు ఆరోగ్యంగానే ఉందని ఎలాంటి ప్రమాదం లేదని తేల్చడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆత్మహత్య యత్నం అంతా ఉత్తిదే అని‌ గుర్తించిన జైలు సిబ్బంది నిందితురాలిని తిరిగి జైలుకు తరలించారు.

జైలులో రిమాండ్ ఖైదీ హైడ్రామా.. సూపర్ యాక్టింగ్‎తో కంగుతిన్న జైలు అధికారులు..
Adilabad Jail
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 17, 2024 | 4:31 PM

భర్త దారుణ హత్య కేసులో‌ ఏ 1 నిందితురాలుగా జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ నిందుతురాలు జైలు నుండి బయటపడేందుకు సూపర్ క్వీన్ యాక్టింగ్ ప్రదర్శించింది. ఆత్మహత్య చేసుకున్నాని.. ప్రాణాలు పోతున్నాయంటూ గొంతు పట్టుకుని కేకలు వేసింది. నిజమేనని నమ్మిన జిల్లా జైలు సిబ్బంది నిందితురాలి ప్రాణాలు కాపాడేందుకు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి ‌తరలించారు. పరీక్షించిన వైద్యులు నిందితురాలు ఆరోగ్యంగానే ఉందని ఎలాంటి ప్రమాదం లేదని తేల్చడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆత్మహత్య యత్నం అంతా ఉత్తిదే అని‌ గుర్తించిన జైలు సిబ్బంది నిందితురాలిని తిరిగి జైలుకు తరలించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా జైల్‎లో చోటు చేసుకుంది.

జూన్ 12న ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం అర్జుని, లోకారి శివారు అటవీ ప్రాంతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్ దారుణ హత్యకు గురయ్యాడు. 24 గంటల్లోనే కేసును చేదించి‌న పోలీసులు.. గజేందర్ హత్యకు కర్త, కర్మ, క్రియ భార్య విజయలక్ష్మి అని తేల్చారు. ప్రియుడి మాయలో పడి.. ఆరు లక్షల సుపారీ ఇచ్చి మరి భర్తను దారుణంగా హత్య చేయించిందని గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు. ఈనెల 15న అరెస్ట్ చేసి రిమాండ్‎కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లా జైలులో రెండు రోజులు రిమాండ్ ఖైదీగా గడిపిన విజయలక్ష్మి సూపర్ యాక్టింగ్‎తో జిల్లా జైలు సిబ్బందిని బోల్తా కొట్టించే ప్రయత్నం చేసింది. జైలులో హైడ్రామా క్రియేట్ చేసి కడుపులో విఫరీతమైన నొప్పి‌ ఉందని.. అరెస్ట్ సమయంలో‌ ఉట్నూర్ డీఎస్పీ కార్యాలయంలో బ్లేడ్ ముక్కలు మింగానని ఆదిలాబాద్ జిల్లా సూపరింటెండెంట్‎కు గోడు వెళ్లబోసుకుంది. రిమాండ్ ఖైదీ కావడం అందులోను మహిళ కావడంతో నిజమే అని నమ్మిన జైలు సిబ్బంది.. తనను కాపాడేందుకు హుటాహుటిన రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఎండోస్కోపీ నిర్వహించి ఎలాంటి ప్రమాదకర పదార్థం మింగలేదని.. బ్లేడ్ ముక్కలు లాంటివి ఏం లేవని తేల్చారు. రెండు గంటలు అబ్జర్వేషన్‎లో పెట్టిన వైద్యులు నిందితురాలి ఆరోగ్యం బాగానే ఉందని తేల్చారు. దీంతో ఊపిరి పీల్చుకున్న జిల్లా జైలు సిబ్బంది తిరిగి భద్రత నడుమ నిందితురాలు విజయలక్ష్మిని జిల్లా జైలుకు తరలించారు. విజయలక్ష్మి సూపర్ క్వీన్ యాక్టింగ్‎ను చూసి‌న జిల్లా జైలు సిబ్బంది ముక్కు మీద వేలాసుకున్నారు. భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేయించిన నిందితురాలిని కూడా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పాడిందంటూ వాపోయారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.